
అమానుషం.. అనాగరికం
● కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన
అనంతపురం కార్పొరేషన్: అమాయకుల ప్రాణాలు బలిగొనడం అమానుషం, అనాగరికమని వైఎస్సార్ సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం అనంతపురంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. జెడ్పీ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ ర్యాలీ కొనసాగింది. అక్కడ అమరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించిన అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేసి ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదన్నారు. విహార యాత్రకు వెళ్లిన అమాయకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం మేలుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు,అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, మల్లెమీద నరసింహులు, అమర్నాథరెడ్డి, చంద్రశేఖరయాదవ్, చింతా సోమశేఖరరెడ్డి, గాజుల ఉమాపతి, ఓబిరెడ్డి, నాయకులు ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, వెన్నం శివరామిరెడ్డి, కేశవరెడ్డి, పెన్నోబులేసు, వేముల నదీం, మారుతీనాయుడు, గౌని నాగన్న, మల్లెల వేణు, సతీష్,కృష్ణవేణి, దేవి, కాకర్ల శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్ గౌడ్, కార్పొరేటర్లు చంద్రమోహన్ రెడ్డి, సాకే చంద్రలేఖ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.