
టీడీపీ నేత జకీవుల్లా ఆకస్మిక మృతి
అనంతపురం క్రైం: టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎంపీ కేఎం సైపుల్లా కుమారుడు జకీవుల్లా (51) ఆదివారం హైదరాబాదులో గుండెపోటుతో మృతి చెందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరుచుకున్న కుటుంబం కావడంతో రాష్ట్ర వ్యాఫ్తంగా పార్టీ నేతలు బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సోమవారం జకీవుల్లా భౌతిక కాయాన్ని అనంతకు తీసుకురానున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం స్వగృహంలో ఉంచనున్నారు. సైపుల్లాకు ఇద్దరు కుమారులు కాగా, పార్టీలో సౌమ్యుడిగా ఉన్న జకీవుల్లా మృతితో పలువురు పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.
మంచి నాయకుడు..
జకీవుల్లా ఉన్నత భావాలు ఉన్న ఓ మంచి నాయకుడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం జకీవుల్లా మృతి చెందిన విషయం తెలియగానే ఆయన సైఫుల్లా ఇంటికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే పలువురు టీడీపీ నేతలు సైఫుల్లా, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

టీడీపీ నేత జకీవుల్లా ఆకస్మిక మృతి