బురదలో దిగి గిరిజనుల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

బురదలో దిగి గిరిజనుల వినూత్న నిరసన

Nov 4 2025 7:30 AM | Updated on Nov 4 2025 7:30 AM

బురదలో దిగి గిరిజనుల వినూత్న నిరసన

బురదలో దిగి గిరిజనుల వినూత్న నిరసన

● బోడిమెట్ట వద్ద బురద ఊబి తొలగించాలంటూ డిమాండ్‌

రోలుగుంట: తమ రాకపోకలకు అంతరాయంగా ఉన్న బోడిమెట్ట బురదలో దిగి గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాజన్నపేట వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కె.గోవింద మాట్లాడుతూ శరభవరం పంచాయతీ పరిధి రాజన్నపేటలో బోడిమెట్ట వద్ద నల్లరాయి క్వారీ కోసం కొత్తగా రోడ్డు నిర్మాణానికి అనుమతిచ్చారన్నారు. ఈ మార్గం బురదమయంగా మారడంతో రాజన్నపేట, వడ్డిప, గదబపాలెం, గుర్రాలబయిల, అర్ల గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. రాత్రిళ్లు ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు బురదలో కూరుకుపోయి పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో 108 వాహనం వెళ్లే అవకాశం లేదన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే బురద సమస్య మెరుగుపరచి రాకపోకలు సుగమం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన దశలువారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘ నాయకులు నీలాపు శ్రీను, రమణ, చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement