 
															మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఇద్దరి ఎంపిక
అప్పలనరసయ్యకు సర్టిఫికెట్ అందిస్తున్న సీపీ
అనకాపల్లి: రాష్ట్ర స్థాయి 45వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు అనకాపల్లి పట్టణానికి చెందిన విశ్రాంత ఎల్ఐసీ ఉద్యోగులు వి.అప్పలనరసయ్య, కె.అప్పలమూర్తి ఎంపికయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ నెల 26న విశాఖలో ఎంపిక పోటీలు జరిగాయి. 800, 1500 మీటర్ల రన్నింగ్ పోటీల్లో అప్పలనర్సయ్య, జావలిన్త్రో, షార్ట్ఫుట్ పోటీల్లో కె.అప్పలమూర్తి సత్తా చాటారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వీరిని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సర్టిఫికెట్లు అందజేసి, అభినందించారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 13, 14 తేదీల్లో గుంటూరు జిల్లా పెదమండిపూడి మండలం పలపర్రు ఎన్ఎన్ ప్రభుత్వ హైస్కూల్లో జరగనున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
