
ఐఐఎస్ఈఆర్లో సాయి అనీష్కు 434వ ర్యాంకు
పాయకరావుపేట: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) బుధవారం ప్రకటించిన ఫలితాలలో శ్రీప్రకాష్ విద్యార్థి జి.సాయిఅనీష్ జాతీయ స్థాయిలో 434వ ర్యాంకు సాధించాడు. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, జేఈఈతో పాటుగా అన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తుండడంతో ఇటువంటి ఫలితాలు సాధ్యమవుతున్నాయని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్, కళాశాల ప్రిన్సిపాల్ వి.వి.ఎస్.ఎస్.భానుమూర్తి తెలిపారు. ప్రతిభ కనబరిచిన సాయిఅనీష్ను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె.నరసింహారావు, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.