రెండు బైకులు ఢీకొని.. ముగ్గురికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీకొని.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Jun 26 2025 6:55 AM | Updated on Jun 26 2025 6:55 AM

రెండు

రెండు బైకులు ఢీకొని.. ముగ్గురికి తీవ్ర గాయాలు

దేవరాపల్లి: దేవరాపల్లి–ఆనందపురం ఆర్‌అండ్‌బీ రోడ్డులో కాశీపురం–సంజీవమెట్ట గ్రామాల మధ్య బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో యువకుడు స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మహిళ పరిస్థితి విషయంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన సుగుణ అనే మహిళ తన కుమార్తే హాఫ్‌ శారీ ఫంక్షన్‌కు బంధువులను ఆహ్వానించడం కోసం ద్విచక్ర వాహనంపై వచ్చి దేవరాపల్లి నుంచి ఇంటికి వెళ్తున్నారు. దేవరాపల్లికి చెందిన వసంతకుమార్‌, నారాయణరావుతో పాటు మరో యువకుడు ద్విచక్ర వాహనంపై ఆనందపురం నుంచి వస్తున్నారు. సంజీవమెట్ట సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు వాహనాలు బలంగా ఢీకొట్టాయి. ఈప్రమాదంలో సుగుణ తలపై బలమైన గాయంతో పాటు రెండు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మిగతా ఇద్దరు యువకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించగా.. అక్కడ ప్రథమ చికిత్స చేశారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించినట్లు సీహెచ్‌సీ వైద్యాధికారి సురేంద్ర బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని దేవరాపల్లి ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావు పరిశీలించి, ప్రమాదం జరిగిన ప్రాంతం వేపాడ మండల పరిధిలోకి వస్తుంద ని ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు బైకులు ఢీకొని.. ముగ్గురికి తీవ్ర గాయాలు 1
1/2

రెండు బైకులు ఢీకొని.. ముగ్గురికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీకొని.. ముగ్గురికి తీవ్ర గాయాలు 2
2/2

రెండు బైకులు ఢీకొని.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement