
పీపీ కాండ్రేగులకు ఎస్పీ అభినందన
అనకాపల్లి: వివిధ కేసుల్లో నేరస్తులకు సకాలంలో కోర్టు ద్వారా జీవిత శిక్ష పడినట్లుగా తమ వాదనలను వినిపించిన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరావును ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం అభినందించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులను సకాలంలో కోర్టులో హాజరు పరిచి, చార్జ్షీట్ దాఖలు చేయడంతో సమర్ధంగా వాదనలు వినిపించగలిగామని, న్యాయమూర్తులు నిందితులకు తగిన శిక్ష విధించారని తెలిపారు.