
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : కశింకోట–అనకాపల్లి రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని సుమారుగా 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుడి ఎత్తు 5.6 అడుగులు, జుట్టు నలుపు రంగు, ఎరుపు రంగు టీషర్టు, బ్లాక్ పుల్ జీన్ఫ్యాంట్ కలిగి ఉన్నట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలకు సెల్నంబర్ 7382058996 ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.