అర్హులందరికీ ఆరోగ్యశ్రీ సేవలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఆరోగ్యశ్రీ సేవలు

Mar 30 2023 1:04 AM | Updated on Mar 30 2023 1:04 AM

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ విభాగాన్నిప్రారంభిస్తున్న వైద్యులు 
 - Sakshi

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ విభాగాన్నిప్రారంభిస్తున్న వైద్యులు

పాయకరావుపేట: అర్హులందరూ ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎయిమ్స్‌ ఎండీ (న్యూఢీల్లీ) డాక్టర్‌ ఏఏవీ రామలింగారెడ్డి అన్నారు. పట్టణంలో గల హైమా నేత్రాలయంలో ఆయన బుధవారం వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా కంటి వైద్య సేవలను ప్రారంభించారు. అనంతరం కంటి వైద్య సేవలపై నేత్రాలయ వైద్యుడు పి.ప్రసాద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో పాటు, ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం, వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ హెల్త్‌ స్కీం, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య నిపుణులు, జిల్లా ప్రొగ్రామ్‌ అధికారి జీవీ రమణకుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌, నేత్రాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement