పలు రైళ్ల దారి మళ్లింపు

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): చైన్నె డివిజన్‌, చైన్నె సెంట్రల్‌–బేసిన్‌ బ్రిడ్జి మధ్య బ్రిడ్జి పునర్నిర్మాణం నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ● ధన్‌బాద్‌లో ఈ నెల 31 నుంచి వచ్చేనెల 24వ తేదీ వరకు బయల్దేరే ధన్‌బాద్‌–అలప్పుజ (13351) ఎక్స్‌ప్రెస్‌ ఎంజీఆర్‌ చైన్నె సెంట్రల్‌ మీదుగా కాకుండా వయా కొరుక్కుపేట, వ్యాసర్‌పడి, పెరంబూర్‌ మీదుగా నడుస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం పెరంబూర్‌లో హాల్ట్‌ ఇచ్చారు. ● అలప్పుజలో వచ్చే నెల 2న బయల్దేరే అలప్పుజ–ధన్‌బాద్‌(13352) ఎక్స్‌ప్రెస్‌ ఎంబీఆర్‌ చైన్నె సెంట్రల్‌ మీదుగా కాకుండా వయా పెరంబూర్‌, కొరుక్కుపేట, చైన్నె బీచ్‌ స్టేషన్‌ల మీదుగా నడుస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్ధం పెరంబూర్‌, చైన్నె బీచ్‌ స్టేషన్లలో హాల్ట్‌ ఇచ్చారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top