ఘనంగా అంబలం పూజ
అంబలం పూజ
భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప మాలధారులు
సాక్షి,పాడేరు: స్థానిక అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి అంబలం పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు. వర్తక సంఘ నేత బూరెడ్డి చిట్టిబాబు స్వామి ఆధ్వర్యంలో సుమారు రూ.7లక్షల వ్యయంతో ఈ పూజను ఏర్పాటుచేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు కాకినాడ జిల్లా నుంచి అయ్యప్పమాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప భక్తి గీతాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజ అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సుబ్బారావు, ఉప సర్పంచ్ బూరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అంబలం పూజ


