ఘనంగా పాణిహాటి మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పాణిహాటి మహోత్సవం

Jun 10 2025 7:03 AM | Updated on Jun 10 2025 7:03 AM

ఘనంగా పాణిహాటి మహోత్సవం

ఘనంగా పాణిహాటి మహోత్సవం

భీమునిపట్నం: భీమిలి సాగరసంగమం సమీపంలో హరేకృష్ణ మూమెంట్‌(గంభీరం) ఆధ్వర్యంలో సోమవారం పాణిహాటి మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ముందుగా సామూహిక సంకీర్తనలతో ప్రారంభమైంది. అనంతరం బలరామకృష్ణుని విగ్రహాలకు పాలు, వివిధ నదుల నుంచి సేకరించిన జలాలు, పంచామృతాలు, పూలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ నిష్కించిన భక్త దాస మాట్లాడుతూ ఈ ఉత్సవానికి ఒక ప్రత్యేక చరిత్ర, గుర్తింపు ఉన్నాయని వివరించారు. హరేకృష్ణ మూమెంట్‌ వ్యవస్థాపకులు శ్రీచైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువులు కోల్‌కతా సమీపంలోని పాణిహాటి గ్రామం వద్ద కృష్ణతత్వాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశారన్నారు. అందులో భాగంగా గంగానది తీరంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించగా.. అప్పటి నుంచి దీనిని నదీ తీరాల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు గోస్తని నది తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందరూ చక్కని జీవన ప్రయాణాన్ని సాగించాలంటే కృష్ణతత్వాన్ని అనుసరించాలని భక్త దాస సందేశమిచ్చారు. అంబరీష్‌ దాసతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement