దోమ.. పనిపట్టేదెలా? | - | Sakshi
Sakshi News home page

దోమ.. పనిపట్టేదెలా?

May 29 2025 7:11 AM | Updated on May 29 2025 7:11 AM

దోమ..

దోమ.. పనిపట్టేదెలా?

పాడేరు: జిల్లాలో మలేరియా జ్వరాల ప్రభావం గతేడాది నుంచి పెరిగింది. దోమల నివారణ మందు పిచికారి చేస్తున్నా వీటిని పూర్తిస్థాయిలో నియంత్రణ సాధ్యపడటం లేదు. మలేరియా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా కొరకరాని కొయ్యలాగే మిగిలిపోయింది.

గతేడాది రికార్డు స్థాయిలో కేసులు

గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు రికార్డు స్థాయిలో 3,687 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 25 వరకు ఐదు నెలల వ్యవధిలో 1122 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది వీటి ప్రభావం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

నత్తనడకన పిచికారీ పనులు

ఏటా జనవరి నుంచి అక్టోబర్‌ వరకు ఏజెన్సీలో మలేరియా కేసులు నమోదు అవుతాయి. వీటిని అరికట్టే చర్యల్లో భాగంగా ఏప్రిల్‌ దోమల నివారణ (ఏసీఎం 5శాతం) మందు స్ప్రేయింగ్‌ చేపడతారు. గతేడాది నమోదైన కేసులు ఆధారంగా అధికారులు 2,086 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించారు.ఈ గ్రామాల్లో ఇప్పటివరకు 40 శాతం మేర గ్రామాల్లో మాత్రమే దోమల నివారణ మందు పిచికారీ జరిగింది. జూన్‌ నెలాఖరులోగా మిగతా గ్రామాల్లో పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పిచికారీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

హైరిస్క్‌ పీహెచ్‌సీలివే..

అనంతగిరి మండలం భీమవరం, పాడేరు మండలం ఈదులపాలెం, కొయ్యూరు మండలం డౌనూరు, మారేడుమిల్లి, చింతూరు మండల పరిధిలో తులసపాకలు, మోతుగూడెం పీహెచ్‌ల పరిధిలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో గతేడాది కన్నా ఈ ఏడాది మలేరియా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో హైరిస్క్‌ పీహెచ్‌సీలుగా అధికారులు గుర్తించారు.

ప్రతిపాదనలకే పరిమితమా?

ఈ ఏడాది కూడా దోమ తెరల పంపిణీ జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్న విమర్శలు గిరిజనుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన దోమ తెరలు చిరిగిపోయాయి. గతేడాది కూడా పంపిణీ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఈ ఏడాది పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే వీటిని పంపిణీ చేయాల్సి ఉండగా ఈ దిశగా చేపట్టిన చర్యలు కానరావడం లేదు. జిల్లాకు 4.8 లక్షల దోమ తెరలు అవసరమని అధికార యంత్రాంగం కూటమి ప్రభుత్వానికి నివేదించినా రప్పించలేకపోయింది.

జిల్లాలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. దోమల నియంత్రణలో కీలకమైన దోమతెరల పంపిణీని గతేడాది గాలికొదిలేసిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విజృంభిస్తున్న మలేరియా జ్వరాలు

గతేడాది నుంచి పెరుగుతున్న కేసులు

మొక్కుబడిగా నియంత్రణ చర్యలు

గతేడాది నుంచి పంపిణీకి

నోచుకోని దోమతెరలు

ఈ ఏడాది పంపిణీ అనుమానమే?

కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి

లోపించిందని విమర్శ

కానరాని

దోమ తెరల

పంపిణీ

గతేడాది రక్తపరీక్షలు, మలేరియా కేసుల వివరాలు

డివిజన్‌ రక్తపరీక్షలు మలేరియా పీవీ మలేరియా పీఎఫ్‌ మొత్తం

పాడేరు 4,46,114 275 2086 2361

రంపచోడవరం 3,61,070 198 700 898

చింతూరు 1,41,243 339 389 428

మొత్తం 9,48,427 812 3175 3,687

ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 25 వరకు..

పాడేరు 1,31,793 105 504 609

రంపచోడవరం 1,05,073 61 236 297

చింతూరు 3,9,943 31 185 216

మొత్తం 2,76,809 197 925 1,122

దోమతెర ఇవ్వలేదు

మూడేళ్ల క్రితం పంపిణీ చేసిన దోమతెరలు కా లం చెల్లడంతో పూర్తిగా చిరిగిపోయాయి. దోమ ల ప్రభావం ఎక్కువగా ఉంది. గతేడాది కొత్త దోమతెరలు పంపిణీ చేస్తారని ఎదురు చూశాం. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు దోమ తెరలు ఇవ్వలేదు. ఇప్పటికై నా ప్రభుత్వం వీటి పంపిణీపై దృష్టి పెట్టాలి.

– చింత గంగమ్మ,

బల్లగరువు, అనంతగిరి మండలం

నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో మలేరియా నివారణపై ప్రత్యేకదృష్టి సారించాం. దీనిలో భాగంగా అత్యవసరంగా 4.8 లక్షల దోమ తెరలు అవసరమని కీటక జనిత వ్యాధుల నివారణ సంస్థకు నివేదించాం. వచ్చే నెలాఖరునాటికి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. మలేరియా పీడిత గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. – తులసి,

జిల్లా మలేరియా నివారణ అధికారి, పాడేరు

ఏజెన్సీలో దోమ తెరల పంపిణీ అస్తవ్యస్తంగా ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే మలేరియా నియంత్రణకు అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. 2021లో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్‌ వెక్టర్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం సంస్థ (ఎన్‌వీబీడీసీపీ) నుంచి 6,22,050 దోమతెరలను రప్పించారు. వీటిని రంపచోడవరం, పాడేరు, చింతూరు డివిజన్ల పరిధిలో పూర్తిస్థాయిలో గిరిజనులకు అందజేశారు. గిరిజన విద్యాలయాల్లోని విద్యార్థులకు కూడా అందజేశారు. అప్పటి ప్రభుత్వం తగిన పురుగు మందు లేదా కీటక వికర్షకంతో చికిత్స చేసిన దోమ తెరలను పంపిణీ చేసింది. వీటి కాలపరిమితి మూడేళ్ల లోపు మాత్రమే ఉంటుంది. వీటిలో చాలావరకు చిరిగిపోవడమే కాకుండా పనికిరాకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2024 జనవరిలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖల ద్వారా జిల్లాకు 6.5 లక్షల కొత్త దోమతెరలు అవసరమని నేషనల్‌ వెక్టర్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం సంస్థకు నివేదించింది. వీటిని ఎపిడిమిక్‌ సీజన్‌ అంటే ఏప్రిల్‌లో పంపిణీ చేయాలని అప్పటిలో పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభావం దోమ తెరల పంపిణీపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతేడాది దోమ తెరల పంపిణీ జరగలేదు. దీంతో దోమ తెరల సమస్య నెలకొంది.

దోమ.. పనిపట్టేదెలా?1
1/3

దోమ.. పనిపట్టేదెలా?

దోమ.. పనిపట్టేదెలా?2
2/3

దోమ.. పనిపట్టేదెలా?

దోమ.. పనిపట్టేదెలా?3
3/3

దోమ.. పనిపట్టేదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement