గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 19 2025 1:26 AM | Updated on Mar 19 2025 1:23 AM

పాడేరు: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్య సంవత్సరంలో ప్రవేశాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. పాడేరులోని డీఈవో కార్యాలయంలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6,7,8 తరగతుల్లో బ్యాక్‌ల్యాగ్‌ సీట్లు, జూనియర్‌ ఇంటర్మీడియెట్‌, డిగ్రీకళాశాల్లో సీట్లు భర్తీ చేస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు http://apr.apcfss.in వెబ్‌ సైట్‌లో ఈనెల 31న తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 25న రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా తాటిపూడి గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్‌, జిల్లా కోఆర్డినేటర్‌ జె.ఎన్‌.సంధ్యాభార్గవి, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ శశికుమార్‌, సిబ్బంది ప్రభావతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement