తాంసి: ఆలయాల నిర్మాణాలు గ్రామస్తుల ఐ క్యతకు నిదర్శనమని, ఐక్యతతో ముందుకు సా గితేనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని ఆదిలాబా ద్ ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. బుధవా రం భీంపూర్ మండలంలోని అంతర్గాం గ్రా మంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు. హోమం, ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణానికి త్వరలోనే రూ.5లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డీసీసీ బీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ ర మేశ్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఎస్సై పీర్సింగ్నాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజు, సర్పంచ్ రాకేశ్యాదవ్ తదితరులున్నారు.


