నేను 2011లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా విధుల్లో చేరాను. 2021లో రెగ్యులర్ ఉద్యోగం వచ్చింది. రిమ్స్తో పాటు భీంపూర్ పీహెచ్సీలో సేవలందించాను. అక్కడికి రోడ్డు సౌకర్యం సరిగా ఉండదు. వర్షాకాలంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాగు దాటాల్సి వచ్చేది. నా సేవలకు గుర్తింపుగా అప్పటి ఐటీడీఏ పీవో, కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాలు అందుకున్నాను. నా కుటుంబ సభ్యుల సహకారంతో విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నాను.
– పి.శ్యామల, స్టాఫ్ నర్సు


