
బొమ్మలు పలుకరించేలా.. తాంసి
● కార్పొరేట్ తరహా వసతులు ● ఏఐ, డిజిటల్ బోధన, యోగాతో ఆకట్టుకుంటున్న వైనం ● ప్రత్యేకత చాటుతున్న ప్రభుత్వ పాఠశాలలు
తాంసిలోని ప్రాథమిక పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదు లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. విద్యార్థులకు నూతన ఉత్సాహం నింపేలా పలు చిత్రాలను హెచ్ ఎం కవిత స్వయంగా గోడలపై తీర్చిదిద్దారు. ఆవరణ సైతం పూ ల మొక్కలతో ఆహ్లాదం పంచుతుంది. ఇందులో 132 మంది విద్యార్థులు ఉండగా వారికి ఐదుగురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేట్కు వెళుతున్న 25 మంది ఇందులో కొత్తగా చేరారు. టీఎల్ఎంతో విద్యాబోధన సాగుతుంది. దీంతో విద్యార్థులు సులువుగా నేర్చుకుంటున్నారు.