సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించాలి

Jun 25 2025 6:50 AM | Updated on Jun 25 2025 6:50 AM

సమయపాలన పాటించాలి

సమయపాలన పాటించాలి

నార్నూర్‌: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు, ఉర్దూమీడియం పాఠశాలలు, విజయ్‌నగర్‌లోని ఎంపీపీఎస్‌తో పాటు దివ్యాంగుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలపై ఆరా తీశారు. ఎంపీపీఎస్‌లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏంఈవో పవార్‌ అనిత, సీసీ రాజేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement