
సమయపాలన పాటించాలి
నార్నూర్: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని డీఈవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు, ఉర్దూమీడియం పాఠశాలలు, విజయ్నగర్లోని ఎంపీపీఎస్తో పాటు దివ్యాంగుల కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలపై ఆరా తీశారు. ఎంపీపీఎస్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏంఈవో పవార్ అనిత, సీసీ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.