15 ఏళ్ల తర్వాత మోగిన బడి గంట | - | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల తర్వాత మోగిన బడి గంట

Jun 25 2025 6:50 AM | Updated on Jun 25 2025 6:50 AM

15 ఏళ్ల తర్వాత మోగిన బడి గంట

15 ఏళ్ల తర్వాత మోగిన బడి గంట

● కలెక్టర్‌ ఆదేశాలతో తెరుచుకున్న డబ్బకుచ్చి పాఠశాల

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్ల తర్వాత ఆ పాఠశాలలో మళ్లీ బడిగంట మోగింది. కలెక్టర్‌ చొరవతో మండలంలోని డబ్బకుచ్చి ప్రభుత్వ పాఠశాల ఎట్టకేలకు పునఃప్రారంభమైంది. దశాబ్దంనరగా పాఠశాల మూతబడి ఉండడాన్ని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఈనెల 23న ప్రజావాణిలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు జిల్లా బాస్‌ రాజర్షి షా ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు మంగళవారం పాఠశాలకు చేరుకున్నారు. గ్రా మస్తులతో కలిసి బడిని పునఃప్రారంభించారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధి కారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. – భీంపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement