మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి

Jun 25 2025 6:50 AM | Updated on Jun 25 2025 6:50 AM

మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి

మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలి

ఆదిలాబాద్‌టౌన్‌: మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ అఖి ల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆవరణలో సిబ్బందితో కలిసి మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రజలు గంజాయి, డ్రగ్స్‌పై ఎలాంటి సమాచారమైనా డయల్‌ 100, పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్‌ రావు, డీఎస్పీలు శ్రీనివాస్‌, ఎల్‌.జీవన్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి యుద్ధం..

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి యుద్ధం చేస్తామని ఎస్పీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌లో విద్యార్థులకు మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించారు. ఎక్కడైనా డ్రగ్స్‌ విక్రయించినట్లు, సేవించినట్లు దృష్టికి వస్త్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ‘ఐ ఆమ్‌ ఆన్‌ యాంటీడ్రగ్‌ సోల్జర్‌’ అంటూ.. విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అంతకముందు విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఇందులో డీఎస్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్‌, టూ టౌన్‌, ట్రాఫిక్‌ సీఐలు సునిల్‌ కుమార్‌, కరుణాకర్‌ రావు, ప్రణయ్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement