యువత మత్తుకు బానిస కావొద్దు | - | Sakshi
Sakshi News home page

యువత మత్తుకు బానిస కావొద్దు

Jun 25 2025 6:50 AM | Updated on Jun 25 2025 6:50 AM

యువత మత్తుకు బానిస కావొద్దు

యువత మత్తుకు బానిస కావొద్దు

● కలెక్టర్‌ రాజర్షి షా

‘రైతు భరోసా’ సద్వినియోగం చేసుకోవాలి

గుడిహత్నూర్‌: రైతు భరోసాను రైతులు సద్వి నియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రాజర్షిషా అ న్నారు. మండలంలోని సీతాగోంది రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. రైతులు సా గులో అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలన్నారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌స్వామి,ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ గుణవంత్‌ చౌహా న్‌, తహసీల్దార్‌ కవితా రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సునీత, ఏవో రమేశ్‌ పాల్గొన్నారు.

కై లాస్‌నగర్‌: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. అలాగే జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలన్నారు. మిషన్‌ పరివర్తన్‌– నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఫ్రీడమ్‌ పార్కులో అధికా రులతో కలిసి మంగళవారం వివిధ రకాల మొక్కలు నాటారు. అయామ్‌ ఆన్‌ యాంటీ డ్రగ్‌ సోల్జర్‌ సెల్ఫీ స్టాండ్‌ వద్ద ఫొటో దిగారు. అనంతరం ఆయ న మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బాని సై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్‌ కమిటీలను నియమించాలన్నారు. గంజాయిసాగు, మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు దృష్టికి వస్తే టోల్‌ఫ్రీ14446, 1908 నంబర్లతో పాటు డయ ల్‌ 100కు సమాచారం అందించాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, సబ్‌కలెక్టర్‌ యువరాజ్‌, ట్రెయినీ కలెక్టర్‌ సలోని, డీఎఫ్‌వో ప్రఽశాంత్‌, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌ రాజు పాల్గొన్నారు.

మత్తు పదార్థ రహిత సమాజ నిర్మాణానికి బహుముఖ వ్యూహం

మత్తు పదార్థ రహిత సమాజ నిర్మాణం కోసం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. అంతర్జాతీయ మాదక ద్ర వ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆకాశవాణితో ముచ్చటించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందకు చేపడుతున్న కార్యక్రమలనువివరించారు. అవగాహనతోనే వీటిని రూపు మాపగలుగుతామన్నారు. ఇందులో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఆకాశవాణి రిటైర్డ్‌ డైరెక్టర్‌ సుమనస్పతిరెడ్డి, ముఖ్య కార్యక్రమాధికారి కె. రామేశ్వర్‌ పాల్గొన్నారు.

‘ఇందిరమ్మ’లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..

కై లాస్‌నగర్‌: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సంబంధిత కమిటీలు, అధికారులు, సి బ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ రాజర్షి షా హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరె న్స్‌ అనంతరం ఆయన జిల్లా అధికారులతో స మీక్షించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పా రదర్శకంగా ఉండాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్‌ శ్యామలా దేవి, సబ్‌కలెక్టర్‌ యువరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement