
‘జూపల్లి’ వస్తున్నారు..
● ఇన్చార్జి మంత్రిగా నియామకం తర్వాత జిల్లాకు తొలిసారిగా.. ● మంత్రి వివేక్తో కలిసి రేపు ఆదిలాబాద్ పర్యటన ● రెండు రోజులపాటు జిల్లాలోనే.. ● ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష ● శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీ షెడ్యూల్
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ఎకై ్సజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్కు వస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా ఆయనతో కలిసి ఈ పర్యటనకు విచ్చేయనున్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రుల పర్యటన అధికారికంగా ఖరారైంది. ఇందులో భాగంగా ఉట్నూర్, తలమడుగు, బేల, నిర్మల్లోనూ పర్యటించనున్నారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టనున్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు.
సర్వత్రా ఆసక్తి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా సీతక్కను నియమించారు. ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కేబినెట్ విస్తరించడం, ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను మార్పు చేసిన విష యం తెలిసిందే. సీతక్కను నిజామాబాద్ జిల్లా కు, ఆ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న జూపల్లిని ఆదిలాబాద్కు మార్చిన విషయం విదితమే. అంతే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్కు చోటు దక్కింది. ఈ క్రమంలో ఇద్దరు మంత్రులు తొలిసారిగా మంత్రి హోదాలో ఆదిలాబాద్కు విచ్చేసి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పర్యటన ఇలా..
● గురువారం వేకువజామున హైదరాబాద్ నుంచి ఇన్చార్జి మంత్రి జూపల్లి రోడ్డు మార్గాన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 11 గంటలకు చేరుకోనున్నారు. స్థానికంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో నేరుగా పాల్గొననున్నారు.
● గురువారం ఆదిలాబాద్లో రూ.1.40 కోట్లతో నిర్మించిన కామన్ సర్వీస్ సెంటర్, తలమడుగులో రూ.1.56 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనాన్ని ప్రారంభించనున్నారు. అలాగే బేల మండలం చప్రాలలో రూ.2.30 కోట్లతో నిర్మిస్తున్న జెడ్పీహెచ్ఎస్ బాలుర హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. రాత్రి జిల్లా కేంద్రంలోని పెన్గంగ విశ్రాంతి భవనంలో బస చేయనున్నారు.
● శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. మావల అర్బన్ పార్కులో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడినుంచి ఉట్నూర్కు బయల్దేరి వెళ్లనున్నారు. ఉట్నూర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నతీకరణలో భాగంగా రూ.13.70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాప న చేయనున్నారు. అనంతరం పీఎంఆర్సీ భ వనంలో ఆదివాసీ కమ్యూనిటీ పెద్దలతో స మావేశం కానున్నారు. అక్కడి నుంచి నిర్మల్ కు బయల్దేరి వెళ్లనున్నారు. నిర్మల్లో ఇందిర మ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. స్వ యం సహాయక సంఘాలకు చెక్కులు ఇవ్వనున్నారు. ఆ సాయంత్రం నిర్మల్ నుంచి బయల్దే రి హైదరాబాద్కు వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే మంత్రుల పర్యటనకు సంబంధించి ఉన్నతాఽ దికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లా ల ఎస్పీలు బందోబస్తు సమీక్షించనున్నారు.