
నగదు రహితంపై అవగాహన అవసరం
తలమడుగు: ప్రతి ఒక్కరూ నగదు రహిత ఆర్థిక లా వాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని నాబార్డ్ డీడీఎం రావుఫ్, జిల్లా సహకార బ్యాంక్ జనరల్ మే నేజర్ సూర్యప్రకాశ్ సూచించారు. శుక్రవారం మండలంలోని సుంకిడి గ్రామంలో తలమడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సభ్యులకు అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తోందని చెప్పారు. ఈ సంవత్సరాన్ని సహకార సంఘాల సంవత్సరంగా ప్రకటించినట్లు తెలి పారు. ఇందులో భాగంగానే రైతులకు సహకార సంఘాల అక్షరాస్యత శిబిరాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సహకా ర సంఘాల ద్వారా రైతులు అన్ని విధాలా లబ్ధి పొందవచ్చని తెలిపారు. రుణాలు సకాలంలో చెల్లి స్తూ రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. జిల్లా సహకార బ్యాంక్ ద్వారా రైతులకు ఖరీఫ్ తోపాటు రైతుమిత్ర, ఇతర రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలను సంఘా ల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులంతా సహకార సంఘాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం ఉ పాధ్యక్షుడు నల్ల పద్మాకర్రెడ్డి, సీఈవో శ్రీనివాస్, సుంకిడి ఏడీసీసీ బ్యాంక్ మేనేజర్ రవియాదవ్, సిబ్బంది సాగర్, రమాకాంత్, రైతులు పాల్గొన్నారు.