నిజాయతీ ఉద్యోగులకు సజ్జనార్‌ సన్మానం | - | Sakshi
Sakshi News home page

నిజాయతీ ఉద్యోగులకు సజ్జనార్‌ సన్మానం

Jun 6 2025 6:00 AM | Updated on Jun 6 2025 6:00 AM

నిజాయతీ ఉద్యోగులకు సజ్జనార్‌ సన్మానం

నిజాయతీ ఉద్యోగులకు సజ్జనార్‌ సన్మానం

ఆదిలాబాద్‌: ఇటీవల బస్సులో బ్యాగ్‌ మర్చిపోయిన ప్రయాణికురాలికి నిజాయతీగా తిరిగి అందించిన ఆదిలాబాద్‌ డిపోకు చెందిన ఇద్దరు ఉద్యోగులను గురువారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సన్మానించారు. ఇటీవల నిర్మల్‌–ఆదిలాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రయాణించిన అక్రమ్‌ బేగ్‌ తన బ్యాగును బస్సులో మర్చిపోయింది. గమనించిన కండక్టర్‌ వీ.రమణ డ్రైవర్‌ ఎం. గులాబ్‌ డిపో అధికారులకు సమాచారం అందించడంతో తిరిగి ప్రయాణికురాలికి అప్పగించారు. ఆ బ్యాగులో 12 గ్రాముల బంగారం, ఫోన్‌ రూ. వెయ్యి నగదు ఉన్నట్లు బాధితురాలు పేర్కొంది. నిజాయతీ చాటుకున్న సదరు ఉద్యోగులను ఎండీ సజ్జనార్‌ బస్‌ భవన్‌లో అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement