● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆసక్తి చూపని జనం ● రేషన్‌ ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రభావం ● గిరాకీ లేక వెలవెలబోతున్న దుకాణాలు | - | Sakshi
Sakshi News home page

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆసక్తి చూపని జనం ● రేషన్‌ ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రభావం ● గిరాకీ లేక వెలవెలబోతున్న దుకాణాలు

May 17 2025 6:01 AM | Updated on May 17 2025 6:01 AM

● క్వ

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ

ఈ స్థాయిలో

ధరలు తగ్గడం తొలిసారి

నేను 30 ఏళ్ల నుంచి బియ్యం అమ్ముతు న్నా. ఏటా వరి ధా న్యం చేతికచ్చినప్పటి నుంచి క్వింటాల్‌ ధర రూ.5వేలతో మొదలై బియ్యం పాతబడుతున్న కొద్ది వాటి ధర పెరిగేదే తప్పా తగ్గదే కాదు. పోయిన సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1000 నుంచి రూ.1700 దాకా తగ్గినయ్‌. ఇన్నేళ్ల నా వ్యాపార జీవితంలో ఇంత ధర తగ్గడం తొలిసారి చూస్తున్న. సన్నబియ్యం విక్రయాలు 70 శాతం పడిపోయాయి. వ్యాపారం ఆశించినంత లేదు.

– కిరణ్‌ కుమార్‌, బియ్యం వ్యాపారి, ఆదిలాబాద్‌

పంట దిగుబడి పెరగడంతోనే..

రాష్ట్రంలో సన్నరకం వడ్ల సాగు గణనీ యంగా పెరిగింది. దిగుబడి కూడా అధికమైంది. దీనికితోడు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోంది. గతంలో చాలా మంది రేషన్‌ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతోనే బియ్యం ధరలు మార్కెట్‌లో గణనీయంగా పడిపోయాయి. షాపుల కిరాయిలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే కొనసాగితే దుకాణాలు మూసేయాల్సిందే.

– సునీల్‌కుమార్‌, బియ్యం వ్యాపారి, ఆదిలాబాద్‌

కై లాస్‌నగర్‌: బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోల్చితే క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1,600 వరకు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ ద్వారా పే దలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లబ్ధిదారులు వీటి ని సద్వినియోగం చేసుకుంటుండగా.. మార్కెట్‌లో ధరలు దిగొస్తున్నాయి. గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. మరోవైపు ఈ స్థాయిలో ధరలు పడిపోవడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబు తున్నారు.

ఇదీ పరిస్థితి..

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పేదలకు ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. తెల్లరేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తి కి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తోంది. ఇవి నాణ్యతతో ఉండటంతో లబ్ధిదారులు వాటిని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకటో తారీకు వచ్చిందంటే చాలు షాపుల వద్ద బారులు తీరి మరీ తెచ్చుకుంటున్నారు. నెల మొదటి వారంలోనే 80 శాతం పంపిణీ పూర్తవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి సన్నరకాల వడ్లసాగును ప్రోత్సహిస్తోంది. రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ సైతం చెల్లిస్తోంది. తద్వారా సన్నాల దిగుబడి పెరిగింది. దీంతో ఇటు ప్రభుత్వం, అటు మిల్లర్లు పోటీపడి మరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తు న్న పరిస్థితి. ఈ క్రమంలో బియ్యం సరఫరా ఒక్కసారిగా పెరిగింది. అయితే రేషన్‌ పంపిణీ కారణంగాపేద,మధ్యతరగతి ప్రజలు మార్కెట్‌లో బియ్యం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. చేసేది లేక వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. గతేడాదితో పోల్చితే క్వింటాల్‌కు పాతవి రూ.800 నుంచి రూ.1600 వరకు, కొత్తవి రూ.1,250 నుంచి రూ.1,700 మేర ధర తగ్గడం గమనార్హం.

తగ్గిన కొనుగోళ్లు..

గత ప్రభుత్వ హయాంలో తెల్లరేషన్‌ కార్డుదారులకు దొడు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో లబ్ధిదారులు వాటిని తినలేక రేషన్‌ డీలర్లకు తక్కువకు అమ్ముకుని మార్కెట్‌లో సన్నబియ్యం కొనుగోలు చేసేవారు. గతేడాది ప్రీమియం రకం (పాతవి) క్వింటాల్‌కు రూ.5,900 నుంచి నుంచి రూ. 6900 వరకు పలకగా.. ప్రస్తుతం ఇవి రూ.4,300 నుంచి రూ.6,100 వరకు లభిస్తున్నాయి. అలాగే కొత్తవి రకాన్ని బట్టి గతంలో రూ.5వేల నుంచి రూ.6,500 వరకు ధర పలకగా.. ప్రస్తుతం రూ.3,700 నుంచి రూ.5,250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో జిల్లాలోని బియ్యం విక్రయ దుకాణాలు వెలవెలబోయి దర్శనమిస్తున్నాయి.

జిల్లాలో బియ్యం ధరల వివరాలు .. (ప్రస్తుతం, గతేడాది ఇదే సీజన్‌లో)

బియ్యం రకం పాతవి కొత్తవి

గతేడాది ప్రస్తుతం గతేడాది ప్రస్తుతం బీపీటీ రూ.5,900 రూ.4,300 రూ.5,000 రూ.3,700

హెచ్‌ఎంటీ రూ.6,100 రూ.4,700 రూ.5,800 రూ.4,100

జైశ్రీరామ్‌ రూ.6,900 రూ.6,100 రూ.6,500 రూ.5,250

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ1
1/4

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ2
2/4

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ3
3/4

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ4
4/4

● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్‌ ● కొనుగోలుకు ఆ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement