మైనర్లకు బైకులివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

మైనర్లకు బైకులివ్వొద్దు

May 4 2025 6:42 AM | Updated on May 4 2025 6:42 AM

మైనర్లకు బైకులివ్వొద్దు

మైనర్లకు బైకులివ్వొద్దు

● నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కేసు ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: మైనర్లకు బైక్‌లు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్‌ మహా జన్‌ అన్నారు. బైక్‌లు నడుపుతూ పట్టుబడ్డ మైనర్ల తల్లిదండ్రులకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్‌ డ్రైవింగ్‌ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. పద్దెనిమిదేళ్లలోపు వారికి బైక్‌లిస్తే వాహన యజమానితో పాటు తల్లిదండ్రులు కేసుల పాలవుతారన్నారు. ఒకవేళ మైనర్‌ ప్రమాదానికి కారణమైతే ఇన్సూరెన్స్‌ సైతం రాకుండా పోతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రిపూట, రోడ్లపై అనవసరంగా తిరగకుండా గమనించాలన్నారు. ఇటీవల నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో 295 మంది మైనర్లు బైక్‌లు నడుపుతూ పట్టుబడగా ఆ వాహనాలను సీజ్‌ చేశామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు సీహెచ్‌ కరుణాకర్‌, ప్రణయ్‌కుమార్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి మురళి, బి శ్రీపాల్‌, ట్రాఫిక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి

పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ప్రతీ శనివారం స్థానిక పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించే పరేడ్‌, యోగా కార్యక్రమాలను ఈ వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరేడ్‌ నిర్వహణ ద్వారా సత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. ఆయుధాల వినియోగం, ట్రాఫిక్‌ సిబ్బందికి సిగ్నల్స్‌పై శిక్షణనిచ్చారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్‌కుమార్‌, సీహెచ్‌ కరుణాకర్‌, కే.ఫణిధర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు టి.మురళి, బి.శ్రీపాల్‌, ఎన్‌.చంద్రశేఖర్‌, మావల ఎస్సై వి విష్ణువర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement