
20న సార్వత్రిక సమ్మె
ఆదిలాబాద్టౌన్: ఈనెల 20న చేపట్టనున్న సా ర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రిమ్స్ కృష్ణ ఏజెన్సీ సూపర్వైజర్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడ్లుగా తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని అ న్నారు. దేశ వ్యాప్త సమ్మెలో శానిటేషన్ సిబ్బంది, పేషెంట్కేర్, సెక్యూరిటీ గార్డులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో సంఘం నాయకులు చందు, రమేశ్, సంగీత, పద్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు.