
పంప్హౌజ్ వద్ద ప్రత్యేక పూజలు
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణానికి 6 ఎంఎల్డీల నీటిని సరఫరా చేసే లాండసాంగ్వి పంప్హౌజ్ ఇటీవల పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. అయితే కలెక్టర్ చొరవతో రూ.40 లక్షల వ్యయంతో పూడికతీత, ఇన్టెక్వెల్ మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో భూగర్భజలాలు ఆశించిన దానికంటే అధికంగానే ఉబికి వచ్చాయి. వర్షాకాలంలాగే పూర్తిస్థాయిలో పట్టణానికి నీటి సరఫరా చేసే అవకాశం లభించింది. దీంతో గురువారం మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రావణ్ కుమార్, ఎంఈ పేరి రాజు పంప్హౌజ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సంప్రదాయబద్ధంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతినిచ్చారు. అనంతరం పట్టణానికి నీటిని సరఫరా చేసే మోటార్లను ప్రారంభించారు. దేవుని ఆశీస్సులతో పట్టణానికి నీటి సమస్య తప్పిందని వారు అభిప్రాయపడ్డారు. వేసవిలోనూ 6 ఎంఎల్డీల నీరు పట్టణంలోని 19 వార్డులకు సరఫరా అవుతుందని వారు పేర్కొన్నారు.