
బస్సును ఢీకొన్న ట్యాంకర్
● కోకస్మాన్నూర్ వద్ద ఘటన ● ఒకరు మృతి ● 22 మందికి గాయాలు
ఇచ్చోడ: బస్సును ట్యాంకర్ ఢీకొన్న ఘటన మండలంలోని కోకస్మాన్నూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 22 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నిర్మల్ వైపు నుంచి ఆదిలాబాద్ వైపు ఆర్టీసీ బస్సు వస్తుంది. పశువులు అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుకాల నుంచి వస్తున్న ట్యాంకర్ వేగంగా బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు డివైడర్ పైకి ఎక్కింది. ట్యాంకర్ రోడ్డు పక్క ఆటో, టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీకొని పక్కనున్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న జైనథ్ మండలం మండగడకు చెందిన భీమక్క(56) తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆదిలాబాద్ రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది, అటోలో 5గురు, టీవీఎస్ ఎక్స్ఎల్పై ఇద్దరు మొత్తం 22 మందికి గాయాలయ్యాయి. వీరిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ఈ ఘటనలో నాలుగు పశువులు అక్కడిక్కడే మృతిచెందాయి. ప్రమాదానికి కారణమైన పశువుల యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

బస్సును ఢీకొన్న ట్యాంకర్