
‘ఇందిరమ్మ’కు ఉచిత ఇసుక
● ప్రభుత్వ అవసరాలకు సైతం.. ● పెన్గంగ పరీవాహక ప్రాంతాల్లో పది రీచ్ల గుర్తింపు ● తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ
బేల మండలం కాంగర్పూర్లో ఇసుక నిల్వలు
కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వపరంగా చేపట్టే నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందించా లని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. పెన్గంగలో ఇసుక లభ్యతపై ఇటీవల సంయుక్త పరిశీలన చే పట్టిన మైనింగ్, ఇరిగేషన్, గ్రౌండ్వాటర్, రెవెన్యూ శాఖల అధికారులు జైనథ్, భీంపూర్, తాంసి, బేల మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లోని పది ఇసుక రీచ్లను గుర్తించారు. వాల్టా చట్టం అనుసరించి ఇసుక వెలికితీయాలని నిర్ణయించారు. తహసీల్దార్ల పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇసుక రీచ్లు ఇవే..
ఉచితంగా ఇసుక అందించేందు కోసం పెన్గంగలో మొత్తం పది ఇసుక రీచ్లను ఎంపిక చేశారు. భీంపూర్ మండలం అంతర్గాంలో ఇసుక మందం 1.5 మీటర్లుగా గుర్తించిన అధికారులు గుబిడి, వడూర్, తాంసి–కే గ్రామాల్లో, అలాగే జైనథ్ మండలంలోని సాంగ్వి–కే, ఆనంద్పూర్, భోరజ్ మండలంలో డో ల్లరా, పెండల్వాడలో 0.5 మీటర్లుగా, బేల మండలంలో మణియర్పూర్, సాంగిడి గ్రామాల్లో 1.5 మీ టర్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఆయా గ్రామాల్లో ను ంచి ఇసుకను ఉచితంగా సరఫరా చేయనున్నారు.
సరఫరా ప్రక్రియ ఇలా...
ఆయా మండలాల తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఉచిత ఇసుక సరఫరా చేపట్టనున్నారు. ఇసుక అవసరము న్న ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రభుత్వ భవనాల ని ర్మాణాలు చేపట్టే కాంట్రాక్టర్లు ముందుగా సంబంధి త తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకోవాలి. వారికి ప్రా ధాన్యత క్రమంలో తహసీల్దార్లు వే బిల్లులు జారీ చే స్తారు. వాటిఆధారంగా నిర్దేశించిన సమయాల్లో ఇ సుకను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆయా వా హనాల డ్రైవర్లకు లైసెన్స్తో పాటు వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇసుకను ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది తహసీల్దార్లకు తప్పనిసరిగా సమాచారమందించాలి. ఎక్కడ డంప్ చేశారనేది వారు స్వయంగా పరిశీలిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా డంప్చేసినా, నిర్దేశిత పనులకు కాకుండా ఇతర వాటికి తరలించినా చట్టప్రకారం ఆ డంప్ల ను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై చర్యలుంటాయని ఆర్డీవో వినోద్కుమార్ తెలిపారు. ఇసుక అవసరమున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆయన సూచించారు.