
వడ్డీ వ్యాపారులకు చెక్పడేనా?
ఆదిలాబాద్లో ఓ ముఖ్య నేతకు సంబంధించిన బంధువు గ్రా మంలో వ్యవసాయ చేస్తుంటాడు. జిల్లా కేంద్రంలోని ఓ విత్తన దుకాణ యజమాని నుంచి రూ.15 లక్షల విలువైన విత్తనాలు, పురుగుల మందులను గతంలో అరువుపై తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఆ వ్యాపారి అసలు సొమ్ముపై వడ్డీ, చక్రవడ్డీ రూపేనా మొదట రూ.25లక్షల వరకు పెంచేశాడు. ఆ తర్వాత దాన్ని రూ.కోటి 25 లక్షల వరకు తీసుకెళ్లాడు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సమయంలో ఆ వ్యాపారి ఇదే అదునుగా అతడిపై డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ఆయన తన భూమిలో నుంచి రెండెకరాలు వ్యాపారి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. అప్పట్లో రూ.కోటి విలువ చేసే ఎకరం చేను ప్రస్తుతం రూ.కోటిన్నరకు పైగా ఉంది. వడ్డీ వ్యాపారుల అక్రమ దందాకు ఈ ఘటన ఓ నిదర్శనం. జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇటీవల కొన్ని బయటపడగా చాలా వరకు వెలుగులోకి రావాల్సి ఉంది. – సాక్షి,ఆదిలాబాద్
జిల్లాలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఇటీవల వడ్డీ వ్యాపారుల నివాసాల్లో పోలీసు శాఖ ఆకస్మిక దాడులు చేసింది. తొలిరోజే ఏకంగా 31 కేసులు నమోదు చేసింది. ప్రామిసరీ నో ట్లు, సేల్డీడ్లు, బ్యాంక్ చెక్కులను భారీగా స్వాధీ నం చేసుకున్నారు. ఈ క్రమంలో జైనథ్ పోలీసుస్టేషన్లో ఈనెల 27న ఓ వడ్డీ వ్యాపారిపై నమోదైన రెండు కేసులు సంచలనం కలిగించాయి. రూ.3లక్షలు అప్పు ఇచ్చి దానికి 25 శాతం వడ్డీ తీసుకోవడం, ఆ రైతుకు సంబంధించి 1.36 ఎకరాల భూమిని తన తమ్ముడి పేరిట రాయించుకోవడం వంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు డబ్బులు కట్టినా తిరిగి భూమి ఇవ్వాలని అడిగితే నిరాకరించిన నేపథ్యంలో అతను పోలీసులను ఆశ్రయించడంతో ఆ వడ్డీ వ్యాపారిపై కేసు నమోదైంది. అతడి వద్ద ఏకంగా 32 సేల్డీడ్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. ఇలా అప్పులు ఇవ్వడం, అలా ఆస్తులు తమ పేరిట చేసుకోవడం, మొత్తంగా వడ్డీ వ్యా పారం పేరిట అమాయకుల నడ్డీ విరుస్తున్న సంఘటనలు కోకొల్లాలుగా జిల్లాలో ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హద్దేలేని సంపాదన..
ఆదిలాబాద్లో ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారికి హద్దేలేని సంపాదన ఉందని జనం చెప్పుకుంటున్నారు. ఆస్తులపత్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అధిక వడ్డీ వసూలు చేయడం ద్వారా అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి నష్టపోయిన దాఖ లాలు ఆదిలాబాద్లో ఇప్పటివరకు లేదు. అదే సందర్భంలో ఇలా వడ్డీకి రుణం తీసుకున్న వ్యక్తులు దాన్ని కట్టలేని పరిస్థితిలో సర్వం కోల్పోతున్నారనే నేపథ్యమే ఆందోళన కలిగిస్తుంది. మరో వైపు వ్యాపారులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.
పూర్తిగా చెక్ పెట్టాలనే అభిప్రాయం..
ఆదిలాబాద్లో వడ్డీవ్యాపారులపై దాడులు, కేసు ల నమోదు నేపథ్యంలో సామాన్య జనం నుంచి హర్షం వ్యక్తమవుతుంది. మామూలు వడ్డీ వసూలు చేసేవారు కాకుండా అధిక వడ్డీ, ఆస్తులు కై వ సం చేసుకునే విధంగా వ్యవహరించే వడ్డీ వ్యాపారుల భరతం పట్టాలని కోరుతున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ విషయంలో పూర్తిస్థాయిలో చెక్ పెట్టేవరకు ఆపరేషన్ కొనసాగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా బాస్ కొరడా ఝళిపిస్తున్నట్లు తెలుస్తోంది.
బాధితులను జలగల్లా పీల్చుతున్న వైనం
బయటపడ్డవి కొన్నే.. వెలుగులోకి రావాల్సినవి ఎన్నో
అక్రమదందాపై ఫోకస్ పెంచిన ఎస్పీ
చట్ట ప్రకారం చర్యలు
మనీలెండర్స్ చట్టం ప్రకారం వడ్డీ వ్యాపా రం చేసేవారు తప్పనిసరిగా తహసీల్దార్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. జిల్లాలో అనధికారికంగానే పలువురు ఈ వడ్డీ వ్యాపా రం నిర్వహిస్తున్నారు. తాజాగా నెలకు 15శాతం పైబడి వడ్డీ వసూలు చేస్తున్న ఓ వ్యాపారి వ్యవహారం నా దృష్టికి వచ్చింది. పలువురు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. – అఖిల్ మహాజన్, ఎస్పీ