ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

Mar 29 2023 12:32 AM | Updated on Mar 29 2023 12:32 AM

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఐఈవో - Sakshi

పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఐఈవో

ఆదిలాబాద్‌టౌన్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు కెమిస్ట్రి, కామర్స్‌ పరీక్షలు కొనసాగాయి. జనరల్‌ విద్యార్థులు 8,818 మందికి గాను 8,247 మంది హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 994 మందికి గాను 840 మంది హాజరు కాగా 153 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో రవీందర్‌ కుమార్‌ తెలిపారు. ఈసారి పరీక్షల్లో ఒక్క విద్యార్థి కూడా డిబార్‌ కాలేదు. ఈనెల 31నుంచి ఇంటర్‌ మూల్యాంకనం షురూ కానుంది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో స్పాట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొలి విడత ఈనెల 31 నుంచి, రెండో విడత ఏప్రిల్‌ 4 నుంచి, మూడో విడత ఏప్రిల్‌ 6 నుంచి, నాలుగో విడత 9 నుంచి ప్రారంభమవుతుందని డీఐఈవోవివరించారు. మూల్యాంకనం కోసం జిల్లాకు దాదాపు 3లక్షల జవాబు పత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement