breaking news
yohan
-
'కోహ్లి కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం'
చెన్నై: జమైకా స్ర్పింటర్ యోహన్ బ్లేక్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఓటమి అనంతరం తమ తప్పులు, వైఫల్యాలు అంగీరిస్తున్నట్లు కోహ్లిచెప్పడం నచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా యోహన్ బ్లేక్ ట్విటర్లో కోహ్లి కెప్టెన్సీ, టీమిండియా ఆటగాళ్ల గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చాడు. 'టీమిండియా, ఇంగ్లండ్ల మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. కెప్టెన్గా రూట్ అద్భుత ప్రదర్శన చేయడమేగాక డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వయసులో సీనియర్ అయిన అండర్సన్ చివరిరోజు ఆటలో బౌలింగ్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా ఆటతీరు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కోహ్లి కెప్టెన్సీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. జట్టు సమిష్టిగా చేసే తప్పులు, వైఫల్యాలను ఏ మొహమాటం లేకుండా అంగీకరిస్తాడు. బౌలర్లు సరైన దిశలో బౌలింగ్ చేయలేదని.. బ్యాట్స్మెన్లు నిలకడగా పరుగులు సాధించడంలో విఫలమయ్యారని ఒప్పుకోవడం కోహ్లికి మాత్రమే చెల్లింది. టీమిండియాకు శుబ్మన్ గిల్, రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లు ఉండడం అదృష్టం. భవిష్యత్తులో వీరిద్దరికి మంచి పేరు వస్తుంది. వాస్తవానికి గిల్ 50 పరగులుతో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా దానిని నిలబెట్టుకోలేకపోవడం దురదృష్టం, మరోవైపు పంత్ 91 పరుగులతో అటాకింగ్ గేమ్ ఆడడం ఎంతో ఆకట్టుకుంది. పంత్ లాంటి దూకుడైన ఆటగాడు టీమిండియాలో కచ్చింతగా ఉండాల్సిందే. ఆసీస్ టూర్లో పుజారా గాయాలు తగిలినా తన పట్టును విడవకుండా టీమిండియా సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. పుజారా నుంచి మరోసారి అలాంటి ప్రదర్శన రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్లో 1-0 తో ఇంగ్లండ్ లీడ్లో ఉంది. రానున్న టెస్టుల్లో పరిస్థితులు కఠినతరం కానున్న నేపథ్యంలో టీమిండియా మరింత మెరుగ్గా రాణిస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా, ఇంగ్లండ్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి13వ తేదీ నుంచి చెన్నై వేదికగా జరగనుంది. ఇక యోహన్ బ్లేక్ 2011 ప్రపంచ చాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 100 మీ, 200 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ తర్వాత అత్యంత వేగవంతమైన పరుగుల వీరుడిగా రికార్డు సృష్టించాడు. చదవండి: సంజయ్ బంగర్కు ఆర్సీబీ కీలక పదవి ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్ This is what test cricket 🏏 is all about. @BCCI @ECB_cricket @SkyCricket @MichaelVaughan @root66 @imVkohli @jimmy9 @RealShubmanGill @RishabhPant17 @cheteshwar1 #testcricket #Cricket #INDvsENG. pic.twitter.com/z6ZpbCQAh6 — Yohan Blake (@YohanBlake) February 9, 2021 -
అయ్యో జమైకా!
గోల్డ్కోస్ట్: ఉసేన్ బోల్ట్... పరుగుల చిరుత... దశాబ్దంపైగా ట్రాక్పై అతడిదే హవా... పోటీ ఏదైనా దేశానికి తనో పతకాల పంట...! కానీ బోల్ట్ రిటైర్మెంట్ తర్వాత అంతా మారిపోయింది. అతడు లేకుండా కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న జమైకా స్ప్రింట్ విభాగంలో (100, 200 మీటర్లు) ఒక్కటంటే ఒక్క స్వర్ణమూ గెలవలేకపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న యోహాన్ బ్లేక్ తీవ్రంగా నిరాశపరిచాడు. 100 మీటర్ల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ అయిన బ్లేక్ ఈసారి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 200 మీటర్ల పరుగులో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఎలైన్ థాంప్సన్ గాయం కారణంగా పతకం తేలేకపోయింది. మరోవైపు ఈ క్రీడల్లో 4గీ100 మీటర్ల పరుగులో తమ రిలే బృందం స్వర్ణ పతకం నెగ్గడంలో విఫలమవడంతో మరీ తొందరగా రిటైరయ్యావంటూ కొందరు సోషల్ మీడియాలో బోల్ట్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే... తాజా ప్రదర్శనను జమైకా ఒలింపిక్ చీఫ్ క్రిస్టోఫర్ సముదా ఆశావహంగా తీసుకున్నారు. బోల్ట్ ప్రభావం తమపై చాలా ఉందంటూనే, దేశంలో ప్రతిభకు లోటు లేదని పేర్కొన్నారు. స్ప్రింట్లో స్వర్ణాలు సాధించకున్నా ఈసారీ అథ్లెటిక్సే జమైకాకు పతకాలు తేవడంలో పెద్ద దిక్కు అయ్యింది. జమైకా ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 27 పతకాలు సాధించగా అందులో 25 అథ్లెటిక్స్ నుంచే రావడం విశేషం. -
భార్య కాపురానికి రావడం లేదని...
ఒంగోలు : భార్యను కాపురానికి పంపిచడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న యోహాన్ (29) కు ఎనిమిదేళ్ల క్రితం కర్నూలు జిల్లా నర్సాపురానికి చెందిన యువతితో పెళ్లైంది. గత కొన్ని రోజులుగా వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో తన భార్యను కాపురానికి పంపాలని యోహాన్ అత్తింటివారింటికి వెళ్లాడు. ఆ క్రమంలో అతడిపై అత్తింటివారు దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఇంటికి వచ్చి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.