breaking news
working problems
-
Meetho Sakshi: జీతాలే పెద్ద సమస్య.. ఒక రోజు సెలవు తీసుకుంటే రెండు రోజుల జీతం కట్
-
గంటల కొద్దీ కూర్చుని పని చేస్తున్నారా..? ఎంత డేంజర్ అంటే?
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయన్నది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. కానీ కూర్చుని కదలకుండా పనిచేస్తే కొండంత ఆరోగ్య సమస్యలూ చుట్టుముడతాయన్నది నేటి సామెతగా మారింది. ఐటీతో పాటు అనేక రంగాల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే డెస్క్జాబ్స్ పెరిగిపోయాయి. ఆ ఉద్యోగాల్లో ఎక్కువసేపు కూర్చునే ఉండటం, పనిఒత్తిడి కారణంగా వివిధ రకాల వ్యాధులూ పెరిగి పోతున్నాయి. అందువల్ల పనిప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ డెస్క్ వర్క్.. ‘డిస్క్’పై ఎఫెక్ట్.. ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో శక్తి ఖర్చు తగ్గి కొవ్వు పేరుకుపోతోంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ముందుకు వంగి కూర్చోవడం వల్ల వెన్నెముకపై ప్రభావం పడుతోంది. తొలుత పనిచేసేటప్పుడే ఈ ఒత్తిడి ఉంటుంది. తర్వాత పడుకున్పప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. కొన్నేళ్లలో ఇది పూర్తి స్థాయి డిస్క్ సమస్యగా మారుతుంది. పనిచేసే చోట కూర్చునే తీరులో లోపాలు, దీర్ఘకాల పని గంటలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. మణికట్టుపై ‘పని’కట్టు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. ఈ సమస్య మణికట్టు దగ్గర వస్తుంది. మణికట్టు దగ్గర దాదాపు 15 చిన్నచిన్న కండరాలు ఉంటాయి. వీటిలో ఒక్క కండరానికి వాపు వచ్చినా మిగతా అన్నింటిపై ఒత్తిడి పడుతుంది. దీనితో చేతిలో తిమ్మిర్లులా రావడం, రాత్రి పడుకున్నప్పుడు వేళ్లు వణకడం వంటివి జరగొచ్చు. రోజంతా మౌస్, కీబోర్డు వాడి.. ఆ తర్వాత బైక్ హ్యాండిల్, కార్ స్టీరింగ్ పట్టుకోవాల్సిన అవసరం వల్ల మణికట్టు కండరాలు మరింత అధిక శ్రమకు గురవుతాయి. ఐటీ రంగంలో ఎక్కువగా.. ప్రముఖ వెల్నెస్ సంస్థ సోల్ హెల్త్కేర్ సంస్థ అధ్యయనం ప్రకారం.. ఐటీ రంగంలో ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఓ కంపెనీలో పనిచేసే 784 మందిని ఎంచుకుంటే.. అందులో 179 మంది నడుము నొప్పి, 129 మంది గర్భాశయం, వెన్నెముకలోని కీళ్లు/ డిస్క్లను ప్రభావితం చేసే గర్భాశయ స్పాండిలోసిస్, 65 మందిలో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ (చేతుల్లో తిమ్మిర్లు), 61 మందిలో సాక్రోలియాక్ సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ►ఐటీ ఉద్యోగుల్లో గుండె జబ్బులు 147 శాతం ఎక్కువని, వీటితో మరణించే ప్రమాదం 18 శాతం పెరుగుతోందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అధ్యయనంలో వెల్లడైంది. ►ది జర్నల్ ఆఫ్ నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ఎక్కువగా కూర్చోవడం పెద్దపేగు కేన్సర్ ప్రమాదాన్ని 24 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్ ప్రమాదాన్ని 21 శాతం, ఎండోమెట్రియల్ కేన్సర్ ప్రమాదాన్ని 24 శాతం వరకు పెంచుతోంది. కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వచ్చే డీప్ వెయిన్ థ్రాంబోసిస్కు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు దూరం ►కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు వెన్నెముక కుర్చీకి ఆసాంతం ఆనుకునేలా నిటారుగా కూర్చోవాలి. కళ్లకు, స్క్రీన్కు మధ్య తగినంత దూరం ఉండేలా ఉంచుకోవాలి. పాదాలను నేలపై విశ్రాంతిగా ఆనించి ఉంచి మోకాలి వద్ద 90 డిగ్రీల కోణంలో కాళ్లు ఉంచాలి. ►మోచేయి ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వల్ల కలిగే ‘టెన్నిస్ ఎల్బో’ సమస్య డెస్క్ జాబ్ ఉద్యోగుల్లో పెరుగుతోంది. ఈ పరిస్థితిలో కీబోర్డు, మౌస్లను వినియోగించేప్పుడు మణికట్టును వదులుగా ఉంచాలి. ►45 నిమిషాల నుంచి గంట కంటే ఎక్కు వసేపు నిర్విరామంగా కూర్చోవడం మంచిది కాదు. మధ్య మధ్యలో నిలబడటం, నడవటం చేయాలి. ►పని సమయంలో కాఫీలు/టీలు ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ అవకాశాలు పెరుగుతాయి. ►ప్రతి 20 నిమిషాల పాటు కంప్యూటర్, ల్యాప్టాప్ స్క్రీన్పై పనిచేశాక.. కనీసం 20 సెకన్లపాటు మీకు దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. – డాక్టర్ సుధీంద్ర, కిమ్స్ ఆస్పత్రి వైద్యుడు ముందే గుర్తించా.. కంప్యూటర్ ముందు పనిచేయడం మొదలెట్టిన కొన్నినెలల్లోనే ఆరోగ్యంలో తేడా గమనించాను. వేళ్ల తిమ్మిర్లు, నొప్పులు, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వచ్చాయి. డాక్టర్ను కలిసి వారి సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తున్నా. ఇప్పుడు సమస్యలు తగ్గిపోయాయి. మా సీనియర్లలో చాలా మంది మాత్రం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. – స్రవంతి, ప్రైవేటు ఉద్యోగిని హెల్త్ సెషన్స్ జరుగుతున్నాయి మానసిక ఒత్తిడి, శారీరక సమస్యలు కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల్లో ఇప్పుడు సాధారణమైపోయాయి. అనేకమంది జాబ్స్ వదిలేసి సొంత ఉపాధి వైపు మళ్లుతుండటానికి ఇదో కారణం కూడా. అందుకే ఆఫీసుల్లోనే ఆరోగ్యంపై వర్క్షాప్స్ జరుగుతున్నాయి. – సంతోష్, ఐటీ ఉద్యోగి -
పనిచేయని.. పల్లె సమగ్ర సేవ!
ఆర్భాటంగా ప్రారంభం.. ఆదిలోనే తల్లకిందులు నెరవేరని లక్ష్యం.. అరకొరగానే సేవలు చాలాచోట్ల 2-3 మాత్రమే.. ఇరుకుగదులు.. ఆపరేటర్ల కొరత (సాక్షి, మెదక్ జిల్లా నెట్వర్క్) పల్లె ముంగిట వందలాది సేవలను అందించాలని.. కాలు కదపకుండానే అన్నీ అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించారు. గతేడాది మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న జిల్లాలోని 16 మండలాల్లో వీటిని పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించాల్సి ఉంది. ఈ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 300 వరకు సేవలను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పథకం ప్రారంభమై పది నెలలైనా.. పూర్థి స్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు. ఒక్కోచోట 300 కాదు కదా.. కనీసం మూడంటే మూడు సేవలు కూడా అందడం లేదు. కేంద్రాల నిర్వహణ అంత అధ్వానంగా మారింది. దీంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు. ఇరుకు గదుల్లో అరకొర సేవలు ఎంపిక చేసిన గ్రామంలోని పంచాయితీ కార్యాలయాల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బ్యాంకింగ్, స్త్రీనిధి రుణాల పంపిణీ, ఉపాధి కూలీలకు డబ్బుల పంపిణీ, ఆసరా పింఛన్ల పంపిణీ, జనన మరణాల ధ్రువీకరణ పత్రాలు తదితర సేవలను అందించాలని నిర్ణయించారు. ఇందులో విధులు నిర్వర్తించేందుకు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి ఇంటర్ ఆపైన పూర్తి చేసిన వారిని గుర్తించి శిక్షణ కూడా ఇచ్చారు. జిల్లాలోని టేక్మాల్, సదాశివపేట, జహీరాబాద్, హత్నూర, కల్హేర్, మెదక్, దుబ్బాక, కొండపాక-2, పఠాన్చెరు, మిరుదొడ్డి, శివ్వంపేట, గజ్వేల్, కోహీర్ మండలాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పూర్తి స్థాయిలో పనిచేయని కేంద్రాలు ఉదయం 7 నుండి 11 గంటల వరకు సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ ఎక్కడా సేవా కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఈ కేంద్రాలను ఆయా పంచాయితీ కార్యాలయాల్లోని ఓ గదిలో ఏర్పాటు చేశారు. అవి సరిపోకపోవడంతో విధి నిర్వహణ కష్టంగా మారుతోంది. పంచాయతీ సిబ్బందికి ఏర్పాటు చేసిన కంప్యూటర్ రూంలోనే కొన్ని కేంద్రాలకు చోటిచ్చారు. అయితే, ఇప్పటికీ ఆసరా పింఛన్లు, జనన మరణ ధ్రువీకరణ పత్రాల జారీ పంచాయితీ కార్యదర్శి ద్వారానే కొనసాగుతున్నాయి. బ్యాంకు లింకేజీల రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని సేవలను ఒక గొడుగు కిందికి తెచ్చే క్రమంలో ఏర్పాటు చేసిన ఇవి.. పూర్తిగా అందుబాటులోకి వచ్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.