-
రైల్వే స్టేషన్లో దారుణం.. మహిళను మెయింటెనెన్స్ రూమ్లోకి లాక్కెళ్లి..
దేశంలో కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలపై లైంగిక దాడులు చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు రైల్వే ఉద్యోగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన బాధితురాలు(30) రెండేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా నిందితుల్లో ఒక్కడైన సతీష్.. ఆమెకు పరిచయమయ్యాడు. అనంతరం, ఆమెకు రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పాడు. ఈ క్రమంలోనే గురువారం సతీష్ ఆమెకు ఫోన్ చేసి తమ కొత్త ఇంటికి, తన కొడుకు పుట్టినరోజు వేడుకకు రావాలని ఆమెను ఆహ్వానించాడు. సరేనని చెప్పిన బాధితురాలు.. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కీర్తి నగర్ మెట్రో స్టేషన్లో సతీష్ను కలుసుకుంది. ఆమెను.. సతీష్ అనంతరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి.. బాధితురాలని రైల్వే స్టేషన్లోని 8-9 ఫ్లాట్ఫామ్లో ఉన్న ఎలక్ట్రికల్ మెయిన్టేనెన్స్ రూమ్లో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. Woman gang-raped by railway employees at New Delhi station; 4 arrested https://t.co/TREgTlDj5f — The Nations 🌐 (@nation_365) July 23, 2022 కాగా, బాధితురాలు.. తెల్లవారుజామున 3.27 గంటలకు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసులు వెంటనే స్టేషన్కు చేరుకుని ఆమెను రక్షించినట్టు రైల్వే డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. నిందితులు సతీష్ కుమార్, వినోద్ కుమార్, మంగళ్ చంద్, జగదీష్ చంద్ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన -
మోరపల్లిలో మహిళ హత్య.. మద్యం తాగించి.. అత్యాచారం చేసి..!
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో బుధవారం మరో హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి శివారులోని ఊరు చెరువులో చేపలు పట్టేం దుకు బుధవారం ఉదయం మత్స్యకారులు వెళ్లారు. అక్కడ ఓ మహిళ (సుమారు 35) మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీ సులకు సమాచారం అందించారు. బుధ వారం వేకువజామున హత్యకు గురైనట్లు సంఘటన స్థలంలో కనిపిస్తున్న ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడి నుంచో ఓ మహిళను తీసుకొచ్చి మద్యం తాగించి అత్యాచారం చేసి.. ఆమె ప్రతి ఘటించడంతో గొంతుకోసి, తలపై బాది చంపినట్లు అనుమానిస్తున్నారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో అదృశ్యమైన మహి ళల కేసుల నమోదుపై ఆరా తీస్తున్నారు. లైంగిక దాడికి గురైన మహిళ ఎవరు, ఆమెపై అత్యాచారం చేసిన వారెవరు? అనే విషయాలేవీ ప్రస్తుతం తెలియరాలేదని డీఎస్పీ చెప్పారు. -
ముంబైకి జాతీయ మహిళా కమిషన్ బృందం
ముంబై: ముంబైలో ఇటీవల ఓ మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వ్యవహారంపై కేంద్ర జాతీయ మహిళా కమిషన్ బృందం ముంబై చేరుకుంది. బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించిందని పోలీసులు వెల్లడించారు. నగరంలోని సాకినాక ప్రాంతంలో నివాసముంటున్న బాధితురాలి కుటుంబాన్ని కలసి పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని రాజవాది ఆస్పత్రికి వెళ్లారు. బాధితురాలు మరణించే వరకు అక్కడే 36 గంటల పాటు ప్రాణాల కోసం పోరాడారు. అక్కడ వైద్యుల నుంచి పలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సాకినాక పోలీస్ స్టేషన్కు కూడా వెళ్లారు. కేసుకు సంబంధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యాచార కేసుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ సంజయ్ పాండేని కలిసిందని అధికారులు వెల్లడించారు. ఆర్థిక రాజధానిలో జరిగిన ఈ ఘటన 2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక హత్యాచారంలాగే అత్యంత అమానవీయంగా జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. -
కరోనాపై గెలిచినా కామాంధులకు బలైన మహిళ
డిస్పూర్: మాయదారి కరోనా వైరస్ను జయించింది. కానీ కామాంధులకు బలయ్యింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించి తేయాకు తోటలో అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా ఆ ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దుండగుల బారి నుంచి ఆమె కుమార్తె తప్పించుకుంది. ఈ ఘటన అసోంలో హాట్ టాపిక్గా మారింది. చారడియో జిల్లాకు తల్లి (54)తో పాటు కూతురి (17)కి కూడా కరోనా సోకింది. సపేకాతి మోడల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకోవడంతో మే 29వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. అయితే వారు అంబులెన్స్ పెట్టుకోలేని పేదవారు. దీంతో తేయాకు తోటల మీదుగా తల్లీకూతురు ఇంటికి వెళ్తుండగా చీకటి పడింది. 30 కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బొర్హట్ టీ ఎస్టేట్ సమీపంలో ఇద్దరు దుండగులు వచ్చారు. తల్లికూతురిని వెంబడించారు. యుక్త వయసు ఉన్న కూతురు వారి నుంచి తప్పించుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో నీరసంగా ఉండడంతో ఆ తల్లి వారికి చిక్కింది. వారు ఆమెను తేయాకు తోటల సమీపంలో అత్యాచారానికి ఒడిగట్టారు. (చదవండి: ప్రేయసి ముందు అనుమానం గెలిచి.. స్నేహం ఓడింది) అయితే పరుగెత్తుకుంటూ వెళ్లిన కుమార్తె సమీప గ్రామస్తులకు విషయం తెలిపింది. దీంతో ఆ గ్రామస్తులు తల్లి కోసం గాలించారు అయితే దుండగులు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె ఓ పొదల చాటున నిస్సహాయంగా పడింది. వెంటనే గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంబులెన్స్ఏర్పాటు చేయకపోవడంతోనే ఆమెపై అఘాయిత్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంత ‘నెగటివ్ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి ఇంటి వద్ద చేర్చేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు. -
అత్యాచారం: ఇరవై ఆరేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో: తనపై ఆత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులపై 26 ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిందో మహిళ. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నా ఆ నిందితుల బెదిరింపులకు భయపడి సాహసం చేయలేకపోయింది. కాగా, ఇప్పుడు తన కొడుకు సాయంతో వారిపై ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరెల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 1994లో షాజహన్పూర్లో బాధిత మహిళ తన సోదరితో కలిసి నివాసం ఉండేది. అప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు. ఆమె సోదరి ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేసేది. ఆమె బావ ప్రభుత్వ ఉద్యోగి. సోదరి, బావ ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో ఇంటికి పక్కన ఉన్న హసన్, గుడ్డు అనే ఇద్దరు అన్నదమ్ములు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని, చెబితే చంపెస్తామని బెదిరించారు. అలా ఆమెపై రెండెళ్ల పాటు సామూహికంగా ఆత్యాచారం చేశారు. ఈ క్రమంలోనే 1995లో బాధిత మహిళ గర్భవతి అయ్యారు. ఆ సమయంలో ఆమె సోదరి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయలనుకుంది. అలా ఫిర్యాదు చేస్తే నిందితులు ఆమె సోదరిని కూడా చంపుతామని బెందిరించారు. బాధితురాలి గర్భం తీసివేసివేయాలని ఆమె సోదరి ప్రయత్నించారు. కానీ, వైద్యులు ఆమె ఆరోగ్యానికి ప్రమాదమని చెప్పడంతో విరమించుకున్నారు. బాధితురాలి బావకు మరో ప్రాంతానికి ఉద్యోగం బదిలీ కావటం వాళ్లు ఇల్లు వదిలి మరో ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో బాధిత మహిళ బాబుకు జన్మనించింది. అయితే ఆ బాబును ఆమె తన బంధువులకు దత్తత ఇచ్చింది. 2000 సంవత్సరంలో ఆమె వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెపై జరిగిన అత్యాచారాన్ని తెలుసుకున్న ఆమె భర్త ఆమెను విడిచిపెట్టాడు. ఆమె కుమారుడు తన తల్లి తనను దత్తత ఇచ్చిందని తెలుకున్నాడు. అనంతరం తల్లిని కలుసుకొని తన తండ్రి ఎవరని ప్రశ్నించాడు. జరిగిన విషయం తెలుసుకున్న కుమారుడు తన తల్లిపై ఆత్యాచారం చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేయలని ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె తన 24 ఏళ్ల కొడుకు సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. ముందుగా పోలీసులు వారిపై కేసు నమోదు చేయడాన్ని నిరాకరించారు. బాధిత మహిళ కోర్టును ఆశ్రయించడంతో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: ఆర్ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement