breaking news
Wire
-
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వైర్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లకు ఏడాదిగా నోటీసులు ఇస్తున్నా స్పందించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైర్ల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం వాటిల్లడం క్షమించరాని నేరమని మండిపడ్డారు.ఇక ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని, బలవంతంగా తొలగించే కార్యక్రమం చేపట్టాలని స్పష్టంచేశారు. అనుమతులు లేకుండా విద్యుత్తు కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ కనెక్షన్ తీసుకునేవారు విద్యుత్ శాఖ సిబ్బంది సహాయంతోనే ఏర్పాటు చేసుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానం లేని వ్యక్తుల ద్వారా కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు.దీనిపై కన్సల్టెంట్ సంస్థ ఇచి్చన నివేదికపై ఆయన చర్చించారు. సాగునీరు సమృద్ధిగా అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో వివిధ ఎత్తిపోతల పథకాల కింద విద్యుత్ సరఫరా, వినియోగంపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిత్తల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీశ్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శభాష్.. వెంకటేశ్
నారాయణపేట జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న క్రమంలో చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభంపై వైరు తెగిపోయి తన పరిధిలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఈదుకుంటూ వెళ్లి వైర్లు సరిచేసి సరఫరా పునరుద్ధరించి శభాష్ అనిపించుకున్నాడు యువకుడు వెంకటేశ్. సంబంధిత గ్రామాలకు కొన్నేళ్లుగా విద్యుత్ శాఖ నుంచి అధికారికంగా లైన్మెన్ లేకపోయినా కరెంట్ బిల్లుల వసూలుకు నియమించబడిన సదరు యువకుడు తన పని కాకపోయినా ధైర్యం చేసి విద్యుత్ మరమ్మతులు చేశాడు. ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్కు సంబంధించిన కరెంట్ బిల్లుల వసూలుకు స్పాట్బిల్లర్గా కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముశ్రీఫా శివారులో ఉన్న చెరువు మధ్యలో విద్యుత్ వైరు తెగిపోయింది. దీంతో ముశ్రీఫా, ముంగిమళ్ల, ముక్తిపాడ్కు విద్యుత్ సరఫరా నిలిచి గ్రామాల్లో చీకటి అలుముకుంది. సోమవారం ఉదయం విద్యుత్ లైన్ను పరిశీలించగా.. చెరువు మధ్యలో వైరు తెగినట్లు గుర్తించారు. స్పాట్బిల్లర్ వెంకటేశ్ ఎల్సీ తీసుకొని చెరువులో ఈదుకుంటూ వెళ్లి మధ్యలో ఉన్న స్తంభం ఎక్కి వైర్లు సరిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాడు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వెంకటేశ్ను అభినందించారు. ప్రమాదకరమని తెలిసినప్పటికీ ధైర్యం చేసి చెరువు మధ్యలోకి వెళ్లి మరమ్మతు పనులు పూర్తి చేసిన వీడియోలు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడంతో వెంకటేశ్కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
వైరల్ వీడియో: రైల్వే టీసీపై తెగిపడిన హైఓల్టేజ్ తీగ
-
నట్లు, వైరు, ఇనుప గుండు
జైపూర్ : ఆపరేషన్ ముగిసిన తర్వాత బుండి ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఒకింత షాక్కి గురయ్యారు. ఇది కడుపా లేక ఇనుప వస్తువుల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సదరు వ్యక్తి కడుపులోంచి వైద్యులు ఇనుప నట్లు, వైరు, ఇనుప గుండు వంటి వస్తువులు బయటకు తీశారు. వివరాలు.. భోలా శంకర్ (42) అనే వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ.. స్థానిక బుండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఎక్స్ రే తీసిన వైద్యులు ఆ రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు. అతని కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు రిపోర్టుల్లో కనిపించింది. దాంతో ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్ చేశారు. ఆ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించడంతో శంకర్కి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో అతని కడుపులోంచి 6.5 సెంటిమీటర్ల పొడవున్న 116 ఇనుప నట్లతో పాటు.. ఓ వైర్, ఇనుప గుండును కూడా బయటకు తీశారు. ఈ వస్తువులు చూసి ఆశ్చర్యపోయిన డాక్టర్లు ఇది కడుపా.. ఇనుప సామాన్ల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం శంకర్ కోలుకుంటున్నాడని.. అయితే ఈ వస్తువులన్ని అతనికి కడుపులోకి ఎలా వెళ్లాయనే విషయం గురించి అతనేం మాట్లాడటం లేదని వైద్యులు తెలిపారు. -
వైరులో బంగారు తీగలు..
శంషాబాద్ : రోజుకో రకంగా బంగారం తెచ్చే వారిని చూస్తూ శంషాబాద్ విమానాశ్రయం అధికారులు కళ్లు తేలేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు బంగారం తెచ్చే విధానం రోజుకో తీరులో ఉంటోంది. షూల్లో, ఎలక్ట్రానిక్ పరికరాల్లో, చివరికి శరీరంలో దాచుకుని బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ దాఖలాలు నిత్యం చూస్తున్నాం. అలాంటిదే తాజాగా మరో పద్ధతి వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఓ యువకుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగు లోపల వైరు కనిపించడంతో అనుమానం వచ్చిన అధికారులు నిశితంగా పరిశీలించారు. వైరు లోపలి భాగంలో 1,100 గ్రాముల బంగారం తీగలు బయటపడ్డాయి. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.