breaking news
Widow of pensioner
-
Bihar: దగ్గరపడుతున్న ఎన్నికలు.. పింఛను పెంచిన సీఎం నితీష్
పట్నా:ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రలోని రాజకీయ పార్టీలు ఉత్సాహంగా తమ పనులు మొదలుపెట్టాయి. నేడు(శనివారం) బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్టంలోని వృద్ధులు, వికలాంగులు,వితంతువులకు ఇచ్చే నెలవారీ పెన్షన్ను రూ.400 నుండి రూ.1,100కి పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని కోటీ తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది. मुझे यह बताते हुए खुशी हो रही है कि सामाजिक सुरक्षा पेंशन योजना के तहत सभी वृद्धजनों, दिव्यांगजनों और विधवा महिलाओं को अब हर महीने 400 रु॰ की जगह 1100 रु॰ पेंशन मिलेगी। सभी लाभार्थियों को जुलाई महीने से पेंशन बढ़ी हुई दर पर मिलेगी। सभी लाभार्थियों के खाते में यह राशि महीने की 10…— Nitish Kumar (@NitishKumar) June 21, 2025‘సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇకపై ప్రతి నెలా రూ. 400 కు బదులుగా రూ. 1,100 పెన్షన్ అందజేయనున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. జూలై నుండి పెరిగిన పెన్షన్ లభిస్తుంది. దీనివలన ఒక కోటి 9 లక్షల 69 వేల 255 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుందని’ నితీష్ కుమార్ ప్రకటించారు. వృద్ధులు సమాజంలో విలువైన భాగస్వాములు, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం మా బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటుంది’ అని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఇటువంటి ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కోడలి కోసం ‘గొయ్యి’ తవ్విన మామ.. పోలీసుల జోక్యంతో.. -
పూర్తి కాని విచారణ
సాక్షి, మంచిర్యాల : సామాజిక భద్రతా (ఆసరా) పెన్షన్ల సర్వే.. విచారణ జిల్లాలో అసమగ్రంగా ముగిసింది. ఆహార భద్రత కార్డుల కంటే ముందుగా అర్హులైన పింఛన్దారులను గుర్తించి ఈ నెల 8 నుంచి పింఛన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత నెల 19న ప్రారంభించిన సర్వే.. విచారణను క్షేత్రస్థాయిలో అధికారులు మమ అనిపించారు. విచారణాధికారులు జిల్లాలో చాలా ప్రాంతాలకు వెళ్లకుండానే ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చేశారు. దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతోపాటు దరఖాస్తు చేసుకోని మరెంతో మంది విచారణాధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా అధికారులేమో విచారణ పూర్తయిందని.. ప్రస్తుతం కంప్యూటరీకరణ జరుగుతోందని ప్రకటిస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఆన్లైన్లో పేరు నమోదు కాకపోతే పింఛన్ రాదని తెలిసి కొందరు అర్హులు స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తున్నారు. ఇంకొందరు మండలాధికారుల వద్దకు వెళ్లి విన్నవించుకుంటున్నారు. వితంతు పింఛన్పై మెలిక ఆది నుంచే.. టీ సర్కార్ వితంతు పింఛన్లకు మెలిక పెడుతూ వస్తోంది. గతంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే వితంతు పింఛన్కు అర్హులని ప్రకటించింది. దీంతో పదేళ్ల క్రితం చనిపోయిన తమ భర్తల మరణ ధ్రువీకరణ పత్రాలు ఎక్కడి నుంచి తెచ్చి సమర్పించాలని వితంతువులు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్న వాళ్లే సమర్పించాలని చెప్పింది. తాజాగా వితంతు మళ్లీ పెళ్లి చేసుకోలేదని సర్టిఫికెట్ ఇస్తేనే పెన్షన్ ఇస్తామని మెలిక పెట్టింది. ఇకపై ఏటా.. ఇలా సర్టిఫికెట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వే పూర్తయ్యింది.. - వెంకటేశ్వర్రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ జిల్లాలో సామాజిక పింఛన్లకు సంబంధించిన సర్వే, విచారణ పూర్తయింది. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల నుంచి మాకు నివేదికలు అందాయి. దరఖాస్తుదారుల వివరాలను కంప్యూటరీకరిస్తున్నాం. తాజాగా పెన్షన్ల అర్హత పరిమితి పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాలొచ్చిన తర్వాత మరింత మంది అర్హులను గుర్తిస్తాం.