breaking news
Visvarupam
-
చేతినిండా డబ్బుంటే చిత్రాలు తీయను
కమలహాసన్ గొప్ప నటుడు. నటనకు సరైన నిర్వచనం కమల్. ఎందుకంటే సినిమా అంటే కమల్. కమల్ అంటే సినిమా. ఐదు దశాబ్దాలకు పైగా సినిమాను కాచి వడబోసిన కళామతల్లి ముద్దుబిడ్డ కమల్. అంతగా సినిమాను ప్రేమించినా కమల్కు సినిమాలో కొన్నిసార్లు ఎదురీదక తప్పలేదు. అయితే ఎలాంటి ఆటుపోటులు కమల్ను ఏమి చేయలేకపోయారుు. విరుమాండి చిత్రానికి ముందు చండియర్ అనే పేరును కమల్ నిర్ణయించారు. అయితే ఆ టైటిల్కు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఆ టైటిల్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తరువాత వసూల్ రాజా ఎంబీబీఎస్ చిత్ర సమయంలో ఆ టైటిల్కు కొందరు డాక్టర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ మధ్య విశ్వరూపం చిత్ర విడుదల సమయంలో కమలహాసన్ ఎంత మనస్థాపానికి గురయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని విశ్వరూపం చిత్ర విడుదలకు మార్గం సుగమం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కమల్ కంట తడిపెట్టడం ప్రతి ఒక్క అభిమాని మనసను ద్రవింప చేసింది. అవసరమైతే మతసామరస్యం గల దేశానికి వలస పోవడానికి వెనుకాడనని అన్నారంటే ఆయన మనసు అప్పుడు ఎంత గాయపడిందో అర్థం చేసుకోవచ్చు. అయినా కమల్ సినిమాకు దూరం కాలేదు. కన్నతల్లిలా ప్రేమించే సినిమాను వదలడం ఆయనకంత సులభం కాదు. ఇప్పటికీ కమల్ స్వీయ దర్శకత్వంలో చిత్రాలు నిర్మిస్తూ నటిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన విశ్వరూపం -2 విడుదలకు ముస్తాబవుతోంది. కమలహాసన్ ఇటీవల కె.వాయ్ముళి పేరుతో యు ట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఈ ఛానల్ ద్వారా అభిమానుల ప్రశ్నలకు బదులిస్తున్నారు. ఇటీవల నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ మీకు చేతి నిండా డబ్బు వస్తే ఎలాంటి చిత్రం చేస్తారు? అని ప్రశ్నించారు. అందుకు కమల్ బదులిస్తూ చేతినిండా డబ్బు ఉంటే చిత్ర నిర్మాణమే మానేస్తానని అన్నారు. అయితే చిత్రాలను చూసే ప్రేక్షకులను తయారు చేస్తానని చెప్పారు. తద్వారా నిర్మాతలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సినిమాను బతికి బట్టకడుతుంది ఎందుకంటే సినిమా అత్యంత ముఖ్యమైనవారు ప్రేక్షకులేనని కమల్ పేర్కొన్నారు. -
ప్రశ్నలు వేయడమే జ్ఞానం అదే ప్రశ్నోపనిషత్ సారం!
ప్రశ్నలు వేయడమే జ్ఞానమని ఉపనిషత్తులు చెప్పాయి. ఆలోచన కలిగిన ‘ప్రశ్న’ అనితరసాధ్యమైన ‘సమాధానాన్ని’ అన్వేషించడానికి సాధనంగా మారుతుంది. ప్రశ్నలేనిదే అన్వేషణ జరగదు. అద్భుత ఆవిష్కరణలు సమాధాన రూపేణా ఆవిర్భవించవు. ఇందుకు నిదర్శనమే ప్రశ్నోపనిషత్తు. తీర్థయాత్రలలో భాగంగా పిప్పలాద మహర్షి ప్రయాగక్షేత్రంలో కాత్యాయనుని కొడుకు కబన్ధితో జరిపిన ప్రశ్నోత్తర సందర్భం సృష్టి రహస్యాన్ని వర్ణిస్తుంది. ‘‘విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం: సహస్ర రశ్మిః శతధా వర్తమానః ప్రాణః ప్రజానాముద యత్యేష సూర్యః’ విశ్వమే రూపంగా కలవాడు, సహస్రకోటి కిరణాలతో ప్రాణికోటికి ప్రాణమైన సూర్యుడు అదుగో ఉదయిస్తున్నాడు. చంద్రప్రకాశాన్ని ఉత్తేజపరుస్తూ జీవనాధారమై వస్తున్నాడని పిప్పలాదుడు చెప్పిన అమృతవాక్కులు అధర్వణవేదానికి చెందిన ప్రశ్నోపనిషత్తులోని అక్షరసత్యాలు. ప్రశాంత వాతావరణంలో ఓరోజు కబన్ధి గురువైన పిప్పలాద రుషితో - ‘చరాచర జగత్తులో ఉంటున్న ఈ ప్రాణులంతా ఎక్కడనుండి పుడుతున్నాయి?’ అని సృష్టి ఆవిర్భావాన్ని, ప్రాణుల పుట్టుకనూ ప్రశ్నిస్తాడు. ప్రపంచంలోని సకల జీవసమూహాన్నీ సృష్టించేవాడు బ్రహ్మ. అతను తపస్సు చేసి సృష్టి రచనకు శ్రీకారం చుట్టాడు. తపశ్శక్తితో ‘పదార్థం- శక్తి’అనే జంటను సృష్టించాడు. అవే అన్నప్రాణాలు. అన్నప్రాణాల సమ్మేళనం వల్లనే అనేక రకాల జీవరాశి ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అన్నంలో చంద్రుడూ, ప్రాణంలో సూర్యుడూ నిత్యమై, నిఖిలమై ఉంటున్నారు. అందుకే బ్రహ్మ మొట్టమొదట అన్నప్రాణాలైన ‘పదార్థం- శక్తి’ సృష్టించాడు. వీటితో సృష్టిరచన ఎలా జరిగిందో వివరించాడు పిప్పలాదుడు. ప్రతిరోజూ ప్రాణమే సూర్యుడిలా ఉదయించి అన్నిప్రాణులకూ తన ప్రకాశంతో జీవనాధారమైన శక్తినిస్తుంది. తన సహస్రకోటికిరణాలతో అంతటా వ్యాపించగలిగే సూర్యుడే సర్వాత్మ. సకల ప్రాణులకూ ఆశయమై, జగన్నేత్రమై, వెలుగొందుతూ జన్మను ప్రసాదిస్తాడు. కనుక సూర్యుడే శక్తిచంద్రుడు పదార్థం. సూర్యుని వెలుగు వల్లనే చంద్రుడు ప్రకాశిస్తాడు కదా! అలాగే శక్తివల్లనే పదార్థం ఏర్పడుతుంది. చంద్రుడు భూమిలోని సారానికి కారకుడు. సృష్టిలోని అన్నం చంద్రుని స్వభావ ంతోనే ఏర్పడుతుంది. నిశీధికి రారాజు అయిన చంద్రుణ్ణే ప్రభావితం చేసే సూర్యభగవానుని ఆరాధించే విధానాన్నీ ప్రశ్నోపనిషత్తు వివరించింది. సూర్యునిచే నిర్మింపబడిన కాలమే బ్రహ్మం. ఆయనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు గతులున్నాయి. సంవత్సరమంటే కాలమే. ఈ కాలమే జగతికి ఆధారం. ప్రపంచంలో పుట్టి తన సంసారచక్రానికి కోరికలతో కట్టుబడి జీవించేవారు దక్షిణాయనం ద్వారా చంద్రలోకాన్ని పొంది మళ్లీ మళ్లీ జన్మను పొందుతారు. ఎవరు సత్యవంతులై ఆత్మతత్వాన్ని అన్వేషించేవారుగా ఉంటారో, వారే జీవిత పరమార్థాన్ని తెలుసుకుని ప్రాణస్వరూపమైన సూర్యలోకాన్ని ఉత్తరాయణం ద్వారా పొందుతారు. సూర్యరూపశక్తే సకల సృష్టికీ ఆదికారణం. మాసమే ప్రజాపతి. దానిలో కృష్ణపక్షం పదార్థం. శుక్లపక్షం శక్తి. అహోరాత్రులు ప్రజాపతి. దానిలో పగలు శక్తి- రాత్రి పదార్థం. అలా అన్నమే ప్రజాపతి. అందులో నుండే శక్తి కలుగుతుంది. దానినుండే ప్రాణులంతా పుడుతున్నారని సవివరంగా ప్రాణుల పుట్టుకనూ, వారు పొందే స్థితిగతులనూ విశదీకరిస్తాడు పిప్పలాద మహర్షి. అద్భుతమైన చరాచర సృష్టి ‘పదార్థం- శక్తి’. అనే జంటనుండి ఆవిర్భవించిందనే విషయాన్ని చెప్పిన ప్రశ్నోపనిషత్తు శాస్త్రీయ విజ్ఞాన సమన్వయంతో సృష్టి రహస్యాన్ని వర్ణించింది. అసలు ప్రాణానికి సూర్యునితో, అన్నానికి చంద్రునితో తాదాత్మ్యం చేసి ఆధ్యాత్మికపరంగా వివరించడమనేది వేదాంత తత్త్వశాస్త్రంలో ఆదిలోనే అర్థవంతంగా సాధించిన అపూర్వ విజయం. అదే ప్రశ్నోపనిషత్ సారం. - ఇట్టేడు అర్కనందనాదేవి శ్లోకం విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిషత్కథితార్థనిధే, హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ శాస్త్రజ్ఞానమనే అమృత సముద్రాన్ని ఆపోశన పట్టిన మహత్తరమైన ఉపనిషదర్థాలకు సుధానిధీ, పరమ పవిత్రమైన నీ పాదాన్ని హృదయంలో తలచినంతమాత్రానే శరణాగతిని ప్రసాదించే ఓ శంకరాచార్యా! నీకు నమస్కారం.