breaking news
Ugandans
-
ఖండాంతరాలకు.. కడలుంగీలు
ప్రాంతానికో ప్రత్యేకత, ఊరికో వైవిధ్యం, ప్రతి దాని వెనకా ఓచరిత్ర.. అలాంటివెన్నో రఘునాథపురం, పుట్టపాక ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చాయి. ఇక్కడి చేనేత, పవర్లూమ్ కార్మికుల చేతిలో రూపుదిద్దుకున్న వస్త్రాలు ఎంతోమంది ప్రముఖులను ఆ‘కట్టు’కున్నాయి. జిల్లా కీర్తిని నలుదిశలా ఇనుమడింపజేస్తున్నాయి. రఘునాథపురం కడలుంగీలు, పుట్టపాక తేలియా రూమాల్, దుబీయన్ వస్త్రాలు నేతన్నల కళాప్రతిభకు నిదర్శనాలుయాదాద్రి భువనగిరి జిల్లా : రాజాపేట మండలంలోని రఘునాథపురం అనగానే మదిలో మెదిలేది పవర్లూమ్(మరమగ్గం) పరిశ్రమ. వీటిపై తయారైన కడలుంగీలు జిల్లా పేరును దేశ, విదేశాలకు తీసుకెళ్లాయి. ఇంత ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత ఇక్కడి కార్మికులకే దక్కుతుంది. అర్ధ శతాబ్దానికి పైగా కడలుంగీలు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. గ్రామంలో 800 వరకు పవర్లూమ్స్ ఉండగా అందులో 400 మరమగ్గాలపై కడలుంగీలు తయారు చేస్తున్నారు. ఒక మరమగ్గంపై పది చొప్పున రోజుకు 3వేల వరకు కడలుంగీలు ఉత్పత్తి అవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా జీవనోపాధి పొందుతున్నారు. పుట్టపాక ప్రత్యేకత.. దుబీయన్ వస్త్రం సంస్థాన్నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ చేనేత కళాకారులు రూపొందించిన వస్త్రాలను ఫ్రాన్స్, సింగపూర్, అమెరికా, జర్మనీ, జపాన్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్కు పుట్టపాక చేనేత కళాకారులు నేసిన దుబీయన్ సిల్క్ చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించారు. చీరను చూసిన బ్రిగిట్టే మెక్రాన్ పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యంపై అప్పట్లో ప్రశంసలు కురిపించారు. లండన్ మ్యూజియం, అమెరికా అధ్యక్షుని భవనంతో పాటు ముఖ్య కార్యక్రమాల్లో, విదేశాల్లోని ప్రముఖ మహిళలు పుట్టపాకలో తయారైన వస్త్రాలను ధరిస్తుంటారు.తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాల తయారీకి ప్రసిద్ధి రఘునాథపురంలో పవర్లూమ్ పరిశ్రమ స్థాపించిన తొలినాళ్లలో షేర్గోలా వస్త్రాలను ప్రసిద్ధి. ఈ వస్త్రాలను హైదరాబాద్లోని రిక్షా కార్మికులు ఎక్కువగా ఉపయోగించేవారు. క్రమేణా హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబయికి షేర్గోల వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. కాలానుగుణంగా నక్కీ, జననీలు, అక్రాలిక్, ఎల్లో ట్రైప్, రీడ్ బైపిక్ వంటి రకరకాల కడలుంగీలను తయారు చేస్తున్నారు. రఘునాథపురానికి చెందిన కొందరు మాస్టర్ వీవర్స్ హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి కేంద్రాలుగా దుబాయ్, సౌదీ అరేబియా, ఒమన్ తదితర అరబ్ దేశాలతో పాటు ఆఫ్రికాలోని ఉగాండాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ దేశాల్లో కడలుంగీలను పురుషులు లుంగీలుగా ఉపయోగిస్తే, మహిళలు డ్రెస్ మెటీరియల్గా వినియోగిస్తుంటారు. -
మేమేమి చేశాం నేరం..
న్యూఢిల్లీ: నగర రాజకీయాలకు తాము బలవుతున్నామని ఢిల్లీలో నివాసముంటున్న ఆఫ్రికన్ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో నడుస్తున్న వ్యభిచార, మాదక ద్రవ్యాల రాకెట్లో ఆఫ్రికన్ యువతను నిందితులుగా ఢిల్లీ మంత్రి ఆరోపించిన విషయం తెలిసిందే. ఉగాండా, నైజీరియా నుంచి చదువుకోవడానికి, వైద్య అవసరాలకు నగరం వచ్చిన పలువురు ఆఫ్రికన్లు శుక్రవారం మీడియాతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.‘గురువారం రాత్రి మేం ఇంట్లో ఉన్నాం.. అకస్మాత్తుగా మా ఇంటి ముందు అరుపు లు విని పించాయి. వచ్చి చూస్తే అక్కడ జనసందోహం కని పించింది. భయపడి ఇంట్లో తాళం వేసుకుని కూర్చున్నాం..’ అని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న 24 ఏళ్ల సాం డ్రా చెప్పింది. వైద్యచికిత్స కోసం వచ్చిన 23 ఏళ్ల సెల్వియా మాట్లాడుతూ.. వారం తా తమను దుర్భాషలాడుతూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం పోలీ సులు వచ్చి తమ ను బయటకు రావాలని పిలిచారన్నారు. ‘మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి కొన్ని పరీక్షలు చేశారు.. తర్వాత ఇంటికి వెళ్లేం దుకు అనుమతించారు..’ అని సాండ్రా తెలిపారు.‘వచ్చిన జనాలను చూస్తే వారు మమ్నల్ని చంపేస్తారేమోననుకున్నాం. చాలా భయపడ్డాం..’ అని అప్పటి సంఘటనను గుర్తుచేసుకుంది. వ్యభిచా రం, మాదకద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులందాయని ఆరోపిస్తూ గురువారం రాత్రి ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్నాథ్ భారతి, ఆప్ కార్యకర్తలు కొందరు గురువారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని ఖిర్కి ఎక్స్టెన్షన్ చేరుకుని హడావుడి చేసిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష్య సాక్షుల కథనం ప్రకారం.. మంత్రి భారతి, కొందరు అనుచరులతో ఒక ఇంటిని చేరుకుని లోపల ఉన్నవారిని బయటకు రావాలని డిమాండ్ చేశారు. ‘అర్ధరాత్రి వేళ నల్ల జాకెట్లు ధరించిన కొందరు వచ్చి మా ఇంటి తలుపులు కొట్టడం మొదలుపెట్టారు. మా పాస్పోర్టులను చూపించాలని డిమాండ్ చేశారు.. పది నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి వారిని పంపించివేశారు’ అని 29 ఏళ్ల ఇరేనే తెలి పింది. పోలీసులు వచ్చిన తర్వాత మంత్రి భారతి వారి తో వాగ్వాదానికి దిగారు. అక్కడ ‘రాకెట్’ నిర్వహిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. అయితే పోలీసులు దానికి నిరాకరిం చారు. వారెంట్ లేకుండా మహిళలను అరెస్టు చేయడం చట్టప్రకారం కుదరదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నగరంలో డ్రగ్స రవాణా కేసుల్లో ఎక్కువ శాతం అరెస్టు అవుతోంది ఆఫ్రికన్ దేశాల వారే కావడం గమనార్హం.


