-
ఇక కౌంటింగ్కి రెడీ.. నాయకులకు పార్టీల ట్రైనింగ్
Madhya Pradesh assembly elections 2023: మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 17న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. కౌంటింగ్కి ఇక కొన్ని రోజులే ఉండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆదివారం తమ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరుగా శిక్షణా సమావేశాలను నిర్వహించాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ భోపాల్లో శిక్షణా సమావేశాన్ని నిర్వహించగా, అధికార బీజేపీ తన అభ్యర్థులతో వర్చువల్గా ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేసింది. భోపాల్లో రెండు షిఫ్టుల్లో 230 మంది అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎం లెక్కింపు ప్రక్రియ గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తొలి సెషన్లో రేవా, షాహదోల్, జబల్పూర్, గ్వాలియర్-చంబల్ డివిజన్ల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఇండోర్, ఉజ్జయిని, నర్మదాపురం, భోపాల్, సాగర్ డివిజన్ల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ పార్టీ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లతో వర్చువల్గా మాట్లాడారు. ఇక అధికార భారతీయ జనతా పార్టీ వీడియో లింక్ ద్వారా శిక్షణా సమావేశాన్ని నిర్వహించింది. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు వర్చువల్ వర్క్ షాప్ నిర్వహించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ మీడియాకు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన కొత్త నిబంధనలు, సాంకేతిక విషయాలను వారికి తెలియజేసినట్లు చెప్పారు. నవంబర్ 29, 30 తేదీల్లో అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఇంగ్లండ్తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్!
ఇంగ్లండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం భారత్ సన్నాహలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా లీసెస్టర్షైర్ వేదికగా జూన్ 24న నుంచి 27 వరకు జరిగే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో కౌంటీ క్లబ్తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో లీసెస్టర్షైర్ చేరుకున్నభారత జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టింది. నెట్స్లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను లీసెస్టర్షైర్ కౌంటీ క్లబ్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా ఇంగ్లండ్ చేరుకున్నాక తొలి ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొన్నాడు. అంతకుముందు టీమిండియా టెస్టు స్పెషలిస్టులతో లండన్లో రెండు రోజుల ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. తొలి ప్రాక్టీస్ సెషన్ రోహిత్ దూరమయ్యాడు. విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్లతో కూడిన తొలి బ్యాచ్ ముంబై నుంచి జూన్ 16న లండన్కు చేరుకుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తొలి బ్యాచ్ వచ్చిన ఒక్క రోజు తర్వాత ఇంగ్లండ్ చేరుకున్నాడు. మరోవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్లో పాల్గొన్న శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ త్వరలోనే టెస్టు జట్టులోకి చేరనున్నారు. భారత్- ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జులై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. కరోనా వ్యాప్తి వల్ల గతేడాది 5 టెస్టుల సిరీస్లో చివరి మ్యాచ్ తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే. చదవండి: 'ట్విటర్కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు.. అప్పుడే జట్టులోకి' Welcome @BCCI 🇮🇳 It's a pleasure to have you at Uptonsteel County Ground this week. 🤝 🎟️ https://t.co/VQUe4Y7KHS 👈 🦊#IndiaTourMatch | #LEIvIND https://t.co/CnPpjMRsDV pic.twitter.com/KX0bAsCQ7o — Leicestershire Foxes 🏏 (@leicsccc) June 20, 2022 Hello from Leicester and our training base for a week will be @leicsccc 🙌 #TeamIndia pic.twitter.com/MAX0fkQcuc — BCCI (@BCCI) June 20, 2022 -
గెలుపుకోసం టీడీపీ కుయుక్తులు
కడప కార్పొరేషన్: ఈ నాలుగేళ్లలో విచ్చలవిడి అవినీతితో దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో ఎదజల్లి గెలవాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పార్థసారథి తెలిపారు. శనివారం కడప నగరంలోని జయరాజా గార్డెన్లో కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల బూత్ కన్వీనర్లకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో గెలుపొందడానికి శిక్షణ తరగతులు నిర్వహించడం ముఖ్యమన్నారు. గ్రామ, మండల, జిల్లా నాయకత్వాలతోపాటు బూత్ కమిటీలు కూడా చాలా ముఖ్యమని చెప్పారు. బూత్ కమిటీలు ప్రజలకు ఎంత చేరువైతే పార్టీకి అంత లాభం కలుగుతుందని చెప్పారు. అధికార టీడీపీ వైఎ‹స్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తోందని, బూత్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గుర్తెరిగి తొలగించిన ఓట్లతోపాటు, కొత్త ఓట్లను చేర్పించాలన్నారు. 2014లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదని, మన పార్టీ ఓటమి వల్ల నష్టపోయింది ప్రజలేనని తెలిపారు. చంద్రబాబు రాయలసీమ వాసులను రౌడీలు, గూండాలుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తూ కోస్తా ప్రజలను అభద్రతాభావానికి గురి చేస్తున్నారని, తద్వారా తన పార్టీకి మేలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎడారిగా ఉన్న రాయలసీమకు కృష్ణాజలాలు ఇవ్వాలనే సంకల్పం దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేని తెలిపారు. పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రులు దేవినేని ఉమా, ఆదినారాయణరెడ్డి చెప్పడం పట్ల విరుచుకుపడ్డారు. వారికి సిగ్గూ, లజ్జా ఉంటే ప్రాజెక్టులకు ఎవరెంత ఖర్చు చేశారో వివరించడానికి కడప సెంటర్లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బలహీన వర్గాలు వారి కాళ్లపై వారు నిలబడేటట్లు చంద్రబాబు చేయడని, వారు అభివృద్ధి్ద చెందడం ఆయనకు ఇష్టం లేదన్నారు. వైఎస్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్లే మైనార్టీలు అభివృద్ధి చెందారని తెలిపారు. మోదీ ప్రభుత్వంపై విశ్వాసం లేకే అవిశ్వాసం:విశ్వేశ్వర్రెడ్డి మోదీ ప్రభుత్వంపై విశ్వాసం లేకనే కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టామని, తమ ఎంపీలు రాజీనామాలు చేశారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. బీజేపీపై ఇంతకంటే పెద్ద పోరాటం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. పార్టీ పునాదిని పటిష్టం చేయాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లు, సభ్యులపైనే ఉందని, కింది స్థాయిలో ఆర్గనైజేషన్ లేకపోవడంవల్లే 2014లో ఓటమి పాలయ్యామని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన దేశంలోనే ఆదర్శవంతమైనదని, బాబు పాలనంతా వైఫల్యాలమయమేనన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసి, మంత్రి పదవులు అనుభవించిన టీడీపీ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీతో చిత్తశుద్దితో పోరాటం చేసింది తమ పార్టీయేనన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి బూత్లో మెజార్టీ తేవడమే లక్ష్యంగా పనిచేయాలి: వైఎస్ అవినాష్రెడ్డి ప్రతి పోలింగ్ బూత్లో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ తేవడమే లక్ష్యంగా బూత్ కన్వీనర్లు పనిచేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరుపుకోనందువల్లే 2014లో పార్టీ ఓటమిపాలైందని, 2019లో ఆ తప్పు పునరావృతం కాకూడదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, స్థానిక సంస్థలు నిర్వీర్యమైన వైనం, నీరు–చెట్టులో అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి పోటాపోటీగా ఇసుక అక్రమంగా తరలించి వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైఎస్ చలువల్లే పుత్తా, ఆది నాయకులుగా ఎదిగారు– సురేష్బాబు దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి చలువ వల్లే మంత్రి ఆదినారాయణ రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి నాయకులుగా ఎదిగారని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్బాబు అన్నారు. ఎన్నికల్లో బూత్ కమిటీల పాత్ర చాలా కీలకమన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేయని తప్పుల్లేవని, చెప్పని అబద్దాలు లేవని అన్నారు. వైఎస్ఆర్ పథకాలే మన పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు.దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయనన్ని ఉద్యమాలు వైఎస్ జగన్ చేశారని తెలిపారు. ప్రతి కార్యకర్తను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: రవీంద్రనాథ్రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి కార్యకర్తను ఆర్థికంగా బలోపేతం చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 98.6 శాతం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. అర్జునుడికి చిలక మాత్రమే కనిపించినట్లుగా బూత్ కన్వీనర్లకు తమ బూత్లోని వెయ్యి ఓట్లే కనిపించాలని అన్నారు. ఓటర్లను చైతన్యం చేయాలి: డా. సుధీర్రెడ్డి ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లను చైతన్యం చేయాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లపై ఉందని జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్రెడ్డి అన్నారు. 1825 రోజులకు అంటే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయని, ఓటుకు రూ.2వేలు ఇచ్చినా రోజుకు రూపాయి పదిపైసలు అవుతుందన్నారు. రూపాయి పది పైసలకు ఓటును అమ్ముకోవద్దని సూచించారు. బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇప్పించుకుంటామని తెలిపారు. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లోనే తెలుస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బూత్ కమిటీ సభ్యుల శ్రమను పార్టీ విస్మరించదు:దుగ్గాయపల్లె బూత్ కమిటీ కన్వీన ర్లు, సభ్యుల శ్రమను, త్యాగాలను వైఎస్ఆర్సీపీ విస్మరించదని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయçపల్లె మల్లికార్జునరెడ్డి అన్నారు. బూత్ లెవెల్లో పార్టీకి మెజార్టీ తీసుకురావాలసిన బాధ్యత బూత్ కన్వీనర్లదేనన్నారు. అంతకుముందు నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి, వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వందేమాతరం గీతంతో శిక్షణతరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్బాషా, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూధన్రెడ్డి, పార్టీ నాయకులు హర్షవర్ధన్రెడ్డి, అఫ్జల్ఖాన్ పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చాక ప్రతి పథకంలోనూ బూత్ కన్వీనర్ల పాత్ర: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి పథకం అమలులోనూ బూత్ కన్వీనర్ల పాత్ర ఉంటుందని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి, పార్టీ ప్రాంతీయ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీని సంస్థాగతంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, అందుకే రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గరు కలిసి పోటీ చేస్తే టీడీపీకి 5లక్షల 30వేల ఓట్లు ఎక్కువ వచ్చాయని, వైఎస్ఆర్సీపీకి విజయం అంచు వరకు వచ్చి జారిపోయిందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ కంటే కాంగ్రెస్కు 7లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ సీట్లు తక్కువ వచ్చాయని, బీజేపీ సూక్ష్మ స్థాయిలో కార్యకర్తలను దించి ఎన్నికలు ఎదుర్కొవడం వల్లే సీట్ల వారి సంఖ్య పెరిగిందని వివరించారు. వైఎస్ జగన్ అరుదైన లక్షణాలు ఉన్న వ్యక్తి అని తెలిపారు. తండ్రికి ఏమాత్రం తీసిపోని తనయుడని, ప్రజల కోసం ఆయనకంటే ఒక అడుగు ముందుకే వేస్తారని తెలిపారు. చంద్రబాబు జిత్తులమారి అని, అవినీతి, దోపిడీ, మోసాలే ఆయన నైజమన్నారు. -
26 నుంచి డీఆర్డీవోలకు శిక్షణ
హైదరాబాద్: కొత్తగా కొలువుదీరిన అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు(డీఆర్డీవో) ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గతంలో ఉన్న డ్వామా సంస్థను ప్రభుత్వం డీఆర్డీఏలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆయా సంస్థలకు ప్రాజెక్ట్ డెరైక్టర్లుగా ఉన్న అధికారులను డీఆర్డీవోలుగా జిల్లాకు ఒకరిని నియమించింది. దీంతో డ్వామా పీడీలకు డీఆర్డీఏ పైనా, డీఆర్డీఏ అధికారులకు డ్వామా కార్యక్రమాల అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆసరా పింఛన్లు, ఉపాధిహామీ పథకం, నగదు చెల్లింపు విధానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు వర్క్షాప్ను ఏర్పాటు చేస్తున్నామని డెరైక్టర్ నీతూ కుమారి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీఎస్ఐపార్డ్)లో జరగనున్న ఈ వర్క్షాప్కు అన్ని జిల్లాల డీఆర్డీవోలు హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement