breaking news
temporarily ban
-
కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..?
ఉత్తరాఖండ్ : చార్ధామ్ యాత్రికులకు వాతావరణం పరీక్ష పెడుతోంది. ఏటా కేవలం ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే గంగోత్రీ, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్ర.. అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్ర. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో 3584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడం మామూలు విషయం కాదు. గత మూడు రోజుల నుంచి రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండలు, కోనలు, ఆ పక్కనే లోయలు, నదులు.. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో ఆకస్మిక వర్షాలు రావడం, ఆ వెంటనే వరదలు పోటెత్తడం ఇక్కడ సాధారణం. తాజా వర్షాలు, వరదల కారణంగా కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. హరిద్వార్, రుషికేష్ల నుంచి యాత్రికులు ముందుకు రావొద్దని కోరారు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి. Char Dham Yatra halted due to bad weather, CM Dhami instructs officials to be vigilant Read @ANI Story | https://t.co/NkileHv4Xw#chardham #chardhamyatra #Kedarnath #Badrinath #PushkarSinghDhami pic.twitter.com/nM38Si9jDm — ANI Digital (@ani_digital) June 26, 2023 20 గంటలపైనే.. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ శివాలయం ఒకటి. హిమాలయాల్లో నిర్మించిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దీన్నిఆదిశంకరాచార్యులు నిర్మించారు. హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో కనీసం 20 గంటల పాటు ప్రయాణం చేస్తేనే బేస్ పాయింట్ గౌరీకుండ్ చేరుకుంటాం. అయితే ఏకబిగిన 20 గంటలు ప్రయాణం అనేది ఏ మాత్రం సాధ్యం కాని పని. ఇదీ చదవండి: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు.. ప్రతికూల వాతావరణం.. కేదార్నాథ్ మంచుకొండల మధ్య ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ కనిష్టంగా ఉంటాయి. హఠాత్తుగా కూలిపడే కొండచరియలు, దెబ్బతినే రోడ్ల నడుమ అసలు ముందుకు సాగుతుందా లేదా అన్నట్టుగా ప్రయాణం ఉంటుంది. పైగా ఆ కొండలపై ట్రాఫిక్ తరచుగా నిలిచిపోతుంది. కేదార్నాథ్కు వాహనాలు వెళ్లవు. దాని బేస్ పాయింట్ గౌరీకుండ్ వరకే వాహనాలుంటాయి. అక్కడి నుంచి నడక మార్గం లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు. హెలీకాప్టర్ ఉన్నా వాతావరణం అనుకూలిస్తేనే ప్రయాణం సాగుతుంది. కేదార్నాథ్ను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలా మంది తహతహలాడుతారు. ఈ సారి బోలెడు మంది ఇప్పటికే హరిద్వార్, రిషికేశ్ చేరుకున్నారు. తాజా వరదలతో నిరాశపడిపోయారు. दयानिधान बाबा केदारनाथ की संध्या आरती दर्शन🙏खराब मौसम और बारिश की वजह से रोकी गई केदारनाथ यात्रा।यात्रियो को सुरक्षित स्थानों पर रुकने की सलाहजय केदार🕉#Kedarnath 🚩 pic.twitter.com/ljJpeEhLaM— श्री केदारनाथ (@ShriKedarnath) June 25, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
-
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
-
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
మలేసియన్లపై ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం ప్యాంగ్యాంగ్: అమెరికా సహా ఏ దేశాన్నైయినా ధిక్కరించే ఉత్తరకొరియా.. మలేసియాతో తగువు పెట్టుకుంటోంది. ఇరు దేశాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తమ దేశం నుంచి మలేసియన్లు వెళ్లకుండా ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం విధించింది. మలేసియాలోని తమ దేశ పౌరులు, దౌత్యవేత్తల రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. ప్యాంగ్యాంగ్లోని మలేసియా దౌత్య కార్యాలయానికి ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయం సానుకూలంగా పరిష్కారమవుతుందని, మలేసియాతో దౌత్యసంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నామని పేర్కొంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు (సవతి తల్లి కొడుకు) కిమ్ జోంగ్ నామ్ మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఉన్ ఈ హత్య చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. నామ్ మృతదేహాన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మలేసియా ఉద్దేశ్యపూర్తకంగానే కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ, నామ్ మృతదేహానికి శవపరీక్షలు చేయడంపై ఉత్తరకొరియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో మలేసియన్లు దేశం విడిచి వెళ్లకుండా ఉత్తరకొరియా నిషేధం విధించింది.