breaking news
Solomon Raj
-
ప్రభుత్వ సంక్షేమ పథకాలు భేష్
ఎంపీ కవితతో భేటీలో మెదక్ డయాసిస్ బిషప్ సొలొమోన్రాజ్ ప్రశంస సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మెదక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎ.సి.సొలొమోన్ రాజ్ అభినందించారు. క్రైస్తవ సమాజం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమని కొనియాడారు. కానీ ఈ ఫలాలు ప్రతి క్రైస్తవుడికి అందినప్పుడే వారు అభివృద్ధి చెందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను బిషప్ శుక్రవారమిక్కడ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మెదక్ డయాసిస్కు మొదటి బిషప్గా బాధ్యతలు స్వీకరించిన సొలొమోన్ రాజ్ను ఎంపీ కవిత అభినందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాల వారినీ సమదృష్టితో చూస్తోందన్నారు. హిందువుల పండుగలకు ఇచ్చిన ప్రాధాన్యమే, ముస్లింలు, క్రై స్తవుల పండుగలకూ ఇస్తున్నామని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారూ తెలంగాణలో నివసిస్తున్నారని, వారి ఆచార, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, గొప్పదనాన్ని భావితరాలకు వారసత్వంగా అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలోని చర్చిల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి బిషప్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కో-ఆప్షన్ సభ్యుడు డాక్టర్ విద్యాస్రవంతి ఉదయ్కుమార్, సీఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ఫ్రొఫెసర్ జొనాథన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజీవ్ సాగర్, సీఎస్ఐ గారిసన్ చర్చ్ పాస్టోరేట్ స్టివార్డ్ ఇ.సుందర్రావు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.దేవసుందరం పాల్గొన్నారు. -
ఓ పనైపోయింది..బాబు
కలెక్టరేట్,న్యూస్లైన్ : గత రెండు నెలలుగా తీరికలేకుండా ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు కాస్త ఊరట లభించింది. గతంలో ఎన్నడు లేని విధంగా వరుసగా మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒకేసారి ప్రాణం మీదికొచ్చినట్లయింది. అసలే రాష్ట్ర విభజన నేఫథ్యంలో రెగ్యులర్ విధులతో సమయం పెరిగిన ఉద్యోగులకు, ఎన్నికల విధులు మరింత సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో దాదాపు మున్సిపాల్ ఎన్నికల్లో 16 వేల మంది ఉద్యోగులు,స్థానిక సంస్థల ఎన్నికల్లో 30 వేల మంది,సార్వత్రిక ఎన్నికల్లో 20 వేల మంది ఉద్యోగులు ఉదయం నుంచి అర్ధరాత్రి పొద్దుపోయే వరకు పనిచేశారు. దీంతో చాలా మంది ఉద్యోగులు అనారోగ్యం పాలయ్యారు. అయినా కొందరు విధులు నిర్వర్తించారు. మరికొంత మంది ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఇరిగేషన్ ఈఈ ప్రశాంత్ రెడ్డి, బోధన్ తహశీల్ధార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సాల్మన్రాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఏజేసీకి ఆనారోగ్యం అదే విధంగా అదనపు జేసీ శేషాద్రి ఎన్నికల విధుల్లో నిమగ్నమై పని ఒత్తిడిలో భా గంగా ఆయన అనారోగ్యపాలైన విషయం తెలిసిందే. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ఉపయోగం,స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగించడంతో ఉద్యోగులకు ఒక్కసారి పనిభారం పెరిగినట్లయింది.బ్యాలెట్ బాక్సులు తరలించడం,ఓటర్ల జాబితా,వాటిని పోలింగ్ కేంద్రాల వారీగా తయారు చేయటం,ఓటరు స్లిప్పులు పంచడం,శిక్షణ,సిబ్బంది నియామకం,పోలింగ్ కేంద్రాల ఏర్పాటు,వాటికి అవసరమైన సామాగ్రి,కేంద్రంలో మౌలిక వసతులు, ఈవీఎంలను తరలించడం, బ్యాలెట్ బాక్సులకోసం స్ట్రాంగ్ రూం ఏర్పాటు, వాటి భద్రతా ఏర్పాట్లు, కౌటింగ్ కేంద్రాల నిర్వహణ, పోలింగ్ లెక్కించడం తదితర పనులలో రెండు నెలలుగా నిమగ్నమయ్యారు. సార్వత్రిక సమరం శుక్రవారం ముగియడంతో ఉద్యోగులు ఇప్పడు ఇప్పుడ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.శుక్రవారం అర్ధరాత్రి వరకు పనిచేసిన ఉద్యోగులు శనివారం ఉదయం కార్యాలయాలకు కాస్త ఆలస్యంగా వచ్చారు.అందరి ముఖాల్లో ఓ పనైపోయిందిరా బాబు అన్నట్లు ఉద్యోగులు ఒకరితో ఒకరు చర్చించుకున్న దృశ్యాలు చాలా శాఖల్లో కనపడ్డాయి.