-
భాగవత జయంతి ఉత్సవాలు
సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో 5వ అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు వర్చువల్ మోడ్లో జరిగాయి. ఫేస్బుక్ , యూట్యూబ్ వేదికలుగా సెప్టెంబరు 4న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగవత పద్యాలు, కీర్తనలు ఆలపించారు. వివిధ దేశాలకు చెందిన 75 మంది పిల్లల భాగవతంలో పలు ఘట్టాలకు సంబంధించి కళా ప్రదర్శనలు చేశారు. సింగపూర్, భారత్ల నుంచే కాకుండా అమెరికా, మలేషియా దేశాలకు చెందిన పిల్లలు పాల్గొన్నారు. ప్రముఖ నేపథ్య గాయకులు నేమాని పార్థసారథి, షర్మిల, కిడాంబి విక్రమాదిత్య, విద్య కాపవరపు, అపర్ణ ధార్వాడ వంటి ప్రముఖుల విద్యార్థుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చదవండి: వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు -
వీధి అరుగు ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
దక్షిణాఫ్రికా తెలుగు సంఘం, వీధి అరుగు- నార్వేలు సంయుక్తంగా వర్చువల్ పద్దతిలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో ప్రముఖ రచయిత్రి మంగిపూడి రాధికకు ప్రవాస తెలుగు పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రచయిత తనికెళ్ళ భరణి ఈ పురస్కారాన్ని అందుకున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి అభినందనలు తెలియజేశారు. మొత్తం 12 మంది ప్రవాస భాషా సేవకుల కృషిని తెలియజేశారు. ప్రవాస భాషా సేవకులు చేస్తున్న కృషిని ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు వంశీ రామరాజు, డాక్టర్ మీగడ రామలింగస్వామిలు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ గారు ముఖ్యఅతిథిగా ప్రారంభోపన్యాసం చేసి ఈ సభను ప్రారంభించారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణ గావిస్తూ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నడిపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విక్రమ్ పెట్లూరు దక్షిణాఫ్రికా, డాక్టర్ వెంకట్ తరిగోపుల నార్వే, సుధాకర్ కువైట్, లక్ష్మణ్ దక్షిణాఫ్రికా, రత్నకుమార్ కవుటూరు సింగపూర్ , పీసపాటి జయ హాంకాంగ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’కు ఎంపికైన రాధికా మంగిపూడి -
సింగపూర్లోనూ భీమ్ యాప్
సింగపూర్: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్ యాప్. అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్ ఫిన్టెక్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్లో భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్... భీమ్ యాప్తో క్విక్ రెస్పాన్స్ కోడ్ను (ఎస్జీక్యూఆర్) స్కాన్ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్ యాప్ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నెట్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ (సింగపూర్) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్ పేర్కొన్నారు. -
ట్రంప్-కిమ్ మధ్య ఆసక్తికర సంభాషణ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement