Shobana
-
మోహన్లాల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. గతంలో లూసిఫర్కు సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న మలయాళ స్టార్ మోహన్లాల్ మరో మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తుడరమ్ అనే క్రైమ్ థ్రిల్లర్లో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్ జోడీగా శోభన హీరోయిన్గా నటించారు. ట్రైలర్ చూస్తే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోహన్లాల్ షణ్ముఖం పాత్రను పోషిస్తుండగా.. శోభన లలితగా కనిపించింది. ఈ సినిమాను రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్పై ఎం రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. -
అభినయ శోభన
మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి, నాట్యమయూరిగా ఎదిగింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం, వన్నె తగ్గని అందం, చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోటే ఉంటే, కనిపించే రూపమే నటి, ప్రముఖ నర్తకి శోభన . ఇటీవల ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించింది. ఆమె విశేషాలు మీ కోసం..⇒ శోభన సొంత ఊరు తిరువనంతపురం. ‘ట్రావెన్కోర్ సిస్టర్స్’గా నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిలకు మేనకోడలు.⇒ ‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్గా కనిపించింది. ⇒ ‘మణిచిత్రతారు’ అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘మిత్ర్, మై ఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది.⇒ చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఎంతో ఇష్టం. 1994లో ‘కళార్పణ’ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి, భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది.⇒ శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేస్తే చాలా కోపం. ఒకసారి ప్రదర్శన మధ్యలో ఫోన్లో రికార్డు చేస్తున్న ఒక ప్రేక్షకుడిని వారించింది.⇒ శోభనకు థాయ్, చైనీస్ వంటకాలు బాగా ఇష్టం. మలేసియాకు వెళితే, అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఆస్వాదిస్తుంది. చీజ్ ఆమ్లెట్ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. నా దుస్తులను నేనే డిజైన్ చేసుకుంటాను. ఒంటికి నప్పని దుస్తులను నేనెప్పుడూ ధరించను. బహుశా, నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనుకుంటా. – శోభన -
పెళ్లి వద్దనుకుని 'కళార్పణ'కు అంకితమైన శోభన
అలనాటి అగ్రతార శోభన బహుముఖ ప్రజ్ఞాశాలి. అంతేకాకుండా బహు భాషా నటి కూడా.. బాలనటిగా సినీ రంగప్రవేశం చేసిన ఆమె తెలుగులో హీరోయిన్గా నాగార్జున నటించిన ‘విక్రమ్’ సినిమాతో పరిచయం అయింది. ఆమె నటి మాత్రమే కాదు.. అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ కూడా.. లెక్కలేనన్ని ప్రదర్శనలు కూడా ఆమె ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించిన శోభన కళారంగంలో చేసిన సేవలకు గానూ తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్(Padma Bhushan) పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు విషయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం శోభన వయసు 54 ఏళ్లు. అయినా, ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది.తెలుగులో టాప్ హీరోలతో సినిమాలునాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన.. 1985లో నాగార్జున తొలి చిత్రం 'విక్రమ్'లో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. చిరంజీవితో రౌడీ అల్లుడు,రుద్రవీణ బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి ఆపై మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారి పెళ్ళాం చిత్రాల్లో నటించింది. అభినందన,కోకిల, ఏప్రిల్ 1 విడుదల,దళపతి,రక్షణ,త్రిమూర్తులు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇటీవలే ప్రభాస్ 'కల్కి' చిత్రంలో నటించిన శోభన చాలామందిని ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం ‘మణిచిత్రతాఝు’లో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో నిలిచారు.'కళార్పణ' పేరుతో శిక్షణ.. పెళ్లికి ఎందుకు నో చెప్పారంటేశోభన చాలా ఏళ్ల క్రితం నుంచే నటన కంటే నాట్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 1994లో 'కళార్పణ' అనే సంస్థకు ఆమె అంకురార్పణ చేశారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భరతనాట్యంలో శిక్షణ, భారతదేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహించడం. అదే విధంగా పలువురు పేద విద్యార్థులకు ఉచితంగా నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు. ఈమె సేవలకు గాను 2006లో అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నటన, నాట్యం కళారంగంలో విశేష సేవలందిస్తున్న శోభన వయసు 54 ఏళ్లు. కాగా ఈ గొప్ప నట కళాకారిణి అవివాహిత కావడం గమనార్హం. పెళ్లి ఎందుకు చేసుకోలేదన్న ప్రశ్నకు శోభన బదులిస్తూ తనకు పెళ్లి చేసుకోవడంలో ఇష్టం లేదని, వివాహ బంధంపై నమ్మకం లేదని చెప్పారు. ఈ జీవితమే సంతోషంగా ఉందని నటి శోభన పేర్కొన్నారు. -
పద్దెనిమిదేళ్ల తర్వాత...
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక ఈ నెల 7న ముంబైలో ఉండొచ్చనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో నటించారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో శోభన పేరు కూడా చేరింది. అయితే ఈ పాత్రల గురించి ప్రస్తుతానికి చిత్రబృందం రహస్యంగా ఉంచుతోంది. ‘కల్కి 2898 ఏడీ’లో శోభన ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. 2006లో వచ్చిన ‘గేమ్’ సినిమా తర్వాత శోభన తెలుగులో మరో సినిమా చేయలేదు. ఒకవేళ ‘కల్కి 2898 ఏడీ’లో ఆమె నటించినది వాస్తవం అయితే పద్దెనిమిదేళ్ల తర్వాత శోభన నటించిన తెలుగు సినిమా ఇదే అవుతుంది. -
Viral Pics: కేరళీయం 2023 వేడుకలు: ఒకే ఫ్రేమ్లో దిగ్గజాలు (ఫొటోలు)
-
'చేసేదేమిలేక శరీరానికి కవర్ చుట్టుకున్నా'..సీనియర్ నటి శోభన
హీరోయిన్ శోభన అంటే ఇప్పటి తరం గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఆ కాలం నాటి సినీ ప్రేక్షకులకు మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. 1980 దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. 1986లో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది శోభన. ఆ తర్వాత విజృంభణ, అజేయుడు, మువ్వగోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెప్పించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, మోహన్బాబు లాంటి అగ్ర హీరోలతో నటించింది. కేవలం నటిగానే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభన తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో శివ మూవీ సెట్లో జరిగిన ఓ విషయాన్ని బయటపెట్టారు. శోభన మాట్లాడుతూ..'రజనీకాంత్తో శివ, దళపతి సినిమాల్లో నటించా. అయితే శివ చిత్రం షూటింగ్లో వర్షం పాట చిత్రీకరించడానికి సెట్ వేశారు. ఆ విషయం నాకు తప్ప.. అక్కడున్న వారందరికీ తెలుసు. శరీరం కనిపించేలా ఉన్న ఓ తెల్ల చీర ఇచ్చి నన్ను కట్టుకోమన్నారు. దీంతో వెంటనే కాస్ట్యూమ్ బాయ్ని పిలిచి.. చీర చాలా పల్చగా ఉంది. ఇంటికెళ్లి.. లోపల ఏదైనా ధరించి దానిపై కట్టుకుని వస్తా అని చెప్పా. అయితే షూట్కు ఎక్కువ సమయం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేమిలేక అక్కడే ఉన్న ఓ టేబుల్ కవర్ని ఒంటికి చుట్టుకున్నా. దానిపై చీర కట్టుకుని షూట్కి రెడీ అయిపోయా. ఆ సాంగ్కు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కవర్ సౌండ్కు రజనీకాంత్ ఇబ్బంది పడ్డారు. ఆరోజు నేను టేబుల్ కవర్ ధరించానని ఎవరికీ తెలియదు. నాకు తెలిసి రెయిన్ సాంగ్స్ అంటే హీరోయిన్స్ను మర్డర్ చేసినట్టే అని నవ్వుతూ.' అన్నారు. కాగా.. 1980లోనే ప్రతిభ గల కళాకారిణులలో శోభన ఒకరు. అందం, నటనే కాదు.. నాట్యంలోనూ అద్భుతంగా రాణిస్తోంది. చెన్నైలోని చిదంబరం నాట్య అకాడమీలో శిక్షణ తీసుకున్న ఆమె.. ఇప్పుడు ఎంతో మంది చిన్నారులకు నాట్యం నేర్పిస్తోంది. 1994లో కళార్పణ అనే సంస్థ ఏర్పాటు చేసి భారతనాట్యంలో శిక్షణ ఇస్తుంది. ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నాట్యానికే తన జీవితాన్ని అంకితమిచ్చారు. కాగా.. 2011లో ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది శోభన. -
SSMB 28: క్రేజీ రూమర్... మహేశ్కు పిన్నిగా శోభన
Shobana To Play Key Role In Mahesh-Trivikram Film: సూపర్స్టార్ మహేశ్బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అనంతరం ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. SSMB28గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అతడు, ఖలేజా’తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడంతో భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో మహేశ్ పిన్నిగా అలనాటి హీరోయిన్ శోభన నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. -
ప్రముఖ సీనియర్ హీరోయిన్కు ఒమిక్రాన్..
Senior Actress Shobana Testes Positive For Omicron: దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా సీనియర్ హీరోయిన్ శోభన కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రపంచమంతా అద్భుతంగా నిద్రపోతున్న వేళ.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నేను ఒమిక్రాన్ బారిన పడ్డాను. కీళ్లనొప్పులు, చలి, గొంతు నొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డాను. ఇప్పటికే రెండు టీకాలు తీసుకున్నాను. దీని వల్ల ఒమిక్రాన్ ముప్పు నుంచి 85శాతం కోలుకుంటామని నమ్ముతున్నాను. అందరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది. కాగా దేశంలో కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహేశ్బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, త్రిష సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) -
సోషల్ హల్చల్: వేడెక్కిస్తున్న సారా, కాలం ఆగిపోవాలంటున్న రాశీ
► ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండు అంటున్న హీరోయిన్ రాశీ ఖన్నా. ► బీచ్ తీరాన వేడివేడిగా విటమిన్ సీ తీసుకుంటూ ఫొటోలు షేర్ చేసిన బాలీవుడ్ భామ సారా అలీఖాన్. ► మనం ప్రపంచాన్ని బ్లాక్ అండ్ వైట్లో చూడకపోవడం వెనక ఓ కారణం ఉంది అని చెబుతున్న హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ► మీ పరిధిని విస్తరించండి అంటూ భరత నాట్య భంగిమను షేర్ చేసిన సీనియర్ నటి శోభన. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) -
ఆయన ఇకలేరంటే నమ్మలేకపోతున్నా
సాక్షి, చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ఆయన మరణ వార్త కోట్లాది మంది అభిమానులనే కాకుండా సినీ నటులను షాక్కు గురుచేసింది. తాజాగా నటి శోభన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎస్పీబీని గుర్తుచేసుకున్నారు. రజనీకాంత్తో కలిసి తాను నటించిన చిత్రానికి ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్ చేశారు. 'ఎస్పీబీ పాడిన పాటను పోస్ట్ చేసేందుకు వెతుకుతుండగా ఆయన లేరనే విషయన్ని నమ్మలేకపోతున్నానని... అలాంటి వ్యక్తి స్థానాన్ని మరెవరూ పూడ్చలేరని' ఆమె భావోగ్వేదంతో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 25న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందారు. చెన్నై శివారు ప్రాంతం తామరపక్కంలోని ఆయన ఫామ్హౌస్ వద్ద అంతిమ కార్యక్రమం జరిగింది. (ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి) View this post on Instagram It is difficult to come to terms with his loss especially while I was searching for a song to post in his memory .. Nothing to be said other than we have lost an irreplaceable treasure . We acted together as well . He played a cop and me , a thief . 🙂Unassuming , jovial , pure and song centered was Spb sir . A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) on Oct 2, 2020 at 9:13pm PDT -
14 ఏళ్ల తర్వాత
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్నారు మలయాళ నటుడు సురేశ్ గోపీ, శోభన. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్ గోపీ. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో చివరిసారి కలసి నటించారు. లేటెస్ట్గా అనూప్ సత్యన్ దర్శకత్వంలో ఈ జంట నటిస్తోంది. తొలిరోజు షూటింగ్లో తీసిన ఫొటో ఇది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. -
మలయాళంలో మళ్లీ
యాక్టర్గా, డ్యాన్సర్గా శోభనను సిల్వర్ స్కీన్పై మిస్ అవుతున్నారు ఆమె అభిమానులు. 2005 నుంచి ఇప్పటివరకూ చాలా తక్కువ సినిమాల్లో కనిపించారు శోభన. 2013లో ‘తిర’ అనే మలయాళ చిత్రం, 2014లో ‘కొచ్చడయాన్’ అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఓ మలయాళ చిత్రంలో కనిపించడానికి శోభన అంగీకరించారు. నజ్రియా నజీమ్, శోభన కీలక పాత్రల్లో నూతన దర్శకుడు అనూప్ సత్యన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సురేశ్ గోపి కీలక పాత్రలో కనిపిస్తారు. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్ గోపి. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో కనిపించిందీ జోడీ. మరి తాజా చిత్రంలో జంటగా నటిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. జూన్లో ఈ సినిమా ఆరంభం కానుంది. -
స్వరరాగ గంగా ప్రవాహం
నవంబర్ 11న హైదరాబాద్లో స్వరరాగ గంగా ప్రవాహం జరగనుంది. ప్రముఖ గాయకులు కె.జె. ఏసుదాస్ లైవ్లో పాడనున్నారు. ఐదు దశాబ్దాలుగా అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు ఏసుదాస్. తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 11న హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్నారు. గతంలో మేస్ట్రో ఇళయరాజాతో, హీరోయిన్, భరత నాట్యం కళాకారిణి శోభనతో ప్రోగ్రామ్స్ నిర్వహించిన ‘11.2’ సంస్థ ఏసుదాస్ ప్రోగ్రామ్ని నిర్వహించనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఏసుదాస్ లైవ్ కన్సర్ట్ జరగలేదు. తొలిసారి జరగనున్న ఈ కార్యక్రమం పోస్టర్ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి.ఆర్ విడుదల చేశారు. -
సినీ రంగంలో ఇది విప్లవం
‘విక్రమ్’ సినిమాతో పరిచయమై దాదాపు అందరి టాప్ యాక్టర్స్తో నటించిన నాయిక శోభన. యాక్టర్ నుంచి ఇప్పుడు మరో కొత్త రూపంలో ప్రేక్షకులకు చేరువ కానున్నారు. జాదూజ్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆమె ఇప్పుడు తెలంగాణ పభుత్వ ‘టి.ఫైబర్’తో కలసి రంగారెడ్డిలోని తూములూరు గ్రామంలో జాదూజ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ‘‘సినిమాను మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసే అద్భుతమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడం హ్యాపీ. ఇదొక విప్లవం కానుంది’’ అన్నారు శోభన. ‘‘జాదూజ్ ద్వారా గ్రామీణులకు విజ్ఞానంతోపాటు వినోదం అందించనున్నాం’’ లోహిత్ అన్నారు. ‘‘తొలి విడతగా 8వేల గ్రామాల్లో 500 జాదూజ్ సెంటర్లు నెలకొల్పుతాం. సినిమాలు ప్రదర్శిస్తాం. ఈ సెంటర్స్లో ‘చాయ్ నాస్తా కేఫ్లు’ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా వంద మిలియన్ డాలర్స్ (సుమారు 700 కోట్లు) ఆదాయంతో పాటు 5 వేల మందికి ఉపాధి దొరుకు తుంది’’ అన్నారు రాహుల్ నెహ్రా. ‘‘సామాన్యులకు దూరమైన సినిమాను దగ్గర చేయడానికి కృషి చేస్తున్న ‘జాదూజ్’ని అభినందిస్తు న్నా’’ అని తెలంగాణ ఐటీ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు. ‘‘ఈ కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరించడం సంతోషం’’ అని శ్రీధర్రావు అన్నారు. -
శోభాయమానం..
-
సీనియర్ హీరోయిన్కు డాక్టరేట్
సీనియర్ నటి, నాట్యకళాకారిణి శోభన, సంగీతదర్శకుడు హరీశ్జయరాజ్లకు ఎంజీఆర్ విద్యా పరిశోధన సంస్థ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. ఈ విద్యాసంస్థ విద్యార్థులకు పట్టాలను అందించే కార్యక్రమం ఈ నెల 10వ తేదీన వేలప్పన్ చావడిలోని ఏసీఎస్ కన్వెన్సన్ సెంటర్లో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఎంజీఆర్ విద్య, పరిశోధన సంస్థ అధినేత ఏసీ.షణ్ముగం నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమంలో విక్రం సారాబాయ్, స్పేస్ డైరెక్టర్ సోమనాథ్, నటి, భరతనాట్యకళాకారిణి శోభన, సంగీత దర్శకుడు హరీశ్జయరాజ్లను గౌరవ డాక్టరేట్లతో ఘనంగా సత్కరించనున్నారు. కార్యకమంలో రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈ వేదికపై 3,300 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అందించనున్నారు. -
దశావతారం
-
అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
-
కోచ్చడయాన్ ప్రపంచ సినిమా
కోచ్చడయాన్ను తమిళ చిత్రంగా చూడకండి, ఇది ప్రపంచ సినిమా అంటోంది హీరోయిన్ దీపికా పదుకునే. సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అత్యంత భారీ చిత్రం కోచ్చడయాన్. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో రూపొందుతున్న కోచ్చడయూన్ తొలి తమిళ 3డీ చిత్రం కావడం విశేషం. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యాప్చరింగ్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య అశ్విన్ దర్శకురాలు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహించిన ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకునే నటిస్తోంది. ఆమె ఇటీవల చెన్నైకి వచ్చిన సందర్భంగా కోచ్చడయాన్ గురించి మాట్లాడింది. కోచ్చడయూన్ అంతర్జాతీయ చిత్రంగా పేర్కొంది. తమిళం, ఆంగ్లం, రష్యన్, జపనీస్, చైనీస్ తదితర భాషల్లో తెరపైకి రానున్నట్లు తెలిపింది. తనను తాను తొలిసారిగా యానిమేషన్ సన్నివేశాలలో చూసి ఆశ్చర్యపోయూనని వెల్లడించిం ది. కోచ్చడయూన్లోని విజువల్ సన్నివేశాలు ఇంతవరకు ఏ భారతీయ చిత్రంలోనూ చోటు చేసుకోలేదని పేర్కొంది. రజనీకాంత్ నిజంగానే ఇండియన్ సూపర్స్టార్ అని పొగడ్తల వర్షం కురిపించింది. సౌందర్య అశ్విన్ శ్రమకు కచ్చితంగా హాలీవుడ్ స్థాయిలో పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కోచ్చడయాన్ విడుదల కోసం రజనీ అభిమానులు మాదిరిగానే తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వివరించింది. కోచ్చడయూన్ నవంబర్ 1న విడుదల కానున్నట్లు సమాచారం.