breaking news
santha bazar
-
అరుదైన మూలికలు@సంతబజార్
సాక్షి, మహబూబ్నగర్ : ఏదైన ఆయుర్వేదం వైద్యానికి కావాల్సిన మూలికలు, దినుసులు నాగర్కర్నూల్ సంత బజార్లో దొరుకుతాయి. చిరుధాన్యాల నుంచి ఆరుదుగా దొరికే అడవి గింజలు, ఆకులు, మూలికలు వరకు అన్ని ఒకే చోట లభ్యమవుతున్నాయి. ఆయర్వేదం వైద్యానికి అవసరమగు నేరేడు విత్తులు, నాగ కేశరములు, అడవి బాదామి, తిప్ప తీగ, తెల్లపట్టిక తదితర అన్నీ ఇక్కడే విక్రయిస్తుంటారు. దాదాపు వంద రకాల దినుసులు, చెట్ల వేర్లు, మూలికలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ముఖ్యంగా మన్ననూర్, హైదరాబాద్లోని బేగంబజార్, సికింద్రాబాద్, బెంగళూర్ వంటి దూర ప్రాంతాల నుంచి వీటిని తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నారు. దశాబ్దాలుగా అనేక రకాలైన దినుసులు, మూలికలు, వేర్లు విక్రయిసున్నారు. అంతే కాకుండా పూజా సామగ్రి విరివిగా లభిస్తాయి. బంగారు విక్రయ షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి. దశాబ్దాలుగా బంగారు విక్రయాలకు నిలయంగా ఈ వీధి ఉంది. అరుదుగా దొరికే కొన్ని రకాల మూలికలు అక్రోట్ కాయలు, మాసి కాయలు, అడవి యాలకులు, నల్లవుసిరి, తిప్ప తీగ, నాగ కేసరములు, పట్టి వేరు, టానికాయలు, అడవి బుర్రెలు, అడవి చింత, కలబంధ, కటక రోహిణి, సకస్తూరి పసుపు, మాని పసుపు, నేల తాటి, నేల గుమ్మడి, ఎర్ర మద్ది, మర్రి ఊడలు, కురు వేరు, వజ కొమ్మలు, అతి వజ, ఆదొండ, దొండ పిండి, కంద చెక్కర, సూర్యనామ, సొంటి, కరక్కాయలు, వాయుకుంభాలు, గంటు భరంగి, ఆకుల కర్ర, సామ్రానీ జైపు, పిట్టకాయలు, సైదవ లవణం, తాటి బెల్లం, సపేదమెస్త్రీ, కర్జూర పండ్లు తదితర ఆయుర్వేదానికి సంబంధించి అడవి మూలికలు లభిస్తాయి. దినుసులు సారా పప్పు, అడవి జిలకర్ర, తోక మిరియాలు, అటుకు మామిడి పప్పు, ఎదురు బియ్యం, లవంగాల పట్ట, రాగి హంస, దులగొండి విత్తులు, నేరేడి విత్తులు, బాదం పప్పు, అడవి జిలకర్ర, ఆజా వాము, కుసుములు, కంది, పెసర, శనగ పప్పు గింజలు, ఆముదాలు, వడ్లు, చిల్ల గింజులతో పాటు చిరు ధాన్యాలు, వివిధ రకాల ఇతర పప్పుధాన్యాలు లభిస్తాయి. గింజల నుంచి మూలికల నుంచి తీసిన నూనెలు ఇప్ప నూనె, కానుగ నూనె, వేప నూనె, ఆవ, కుసుమ, నువ్వుల నూనెలు, ఆముదం నూనె, అల్వీన్ ఆయిల్ తదితర నూనెలు ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాలైన పుప్పు ధాన్యాలు, మూలికలు, వేర్లు, ఆయుర్వేదంకు అవసరమయ్యే అనేక రకాల మొక్కలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాము. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాం. ప్రజలు వచ్చి తమకు అవసరం అయ్యే వాటినే కొంటారు. ఆన్లైన్లో కూడా మా దుకాణం సమాచారం వస్తుంది. – బొడ్డు వెంకటప్రసాద్, వ్యాపారి, సంతబజార్, నాగర్కర్నూల్ -
సండే స్పెషల్ శనివారమైంది!
ఆశీల వసూలు దారుల ఇష్టారాజ్యం మారిన తరతరాల ఆదివారపు సంత మంగళవారం సెలవు ఆదివారానికి మారుతోంది? నాగాయలంక: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఆదివారం సెలవు. కానీ నాగాయలంకలో మంగళవారం సెలవు దినం. అందుకు ఓ ప్రత్యేక ఉంది. ఆదివారం నాగాయలంక ఉప్పు చేపల సంత జరుగుతుంది. పంచాయతీ అనుమతి లేకుండానే ఆశీలు వసూలుదారులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చేశారు. శనివారం రోజు చేపల సంత నిర్వహిస్తున్నారు. నాగాయలంకలో ప్రతి ఆదివారం ఎండుచేపలసంత నిర్వహిస్తారు. ఉప్పు చేపలు, ఎండు రొయ్యలు, రొయ్యపప్పు, మెత్తళ్లు లాంటి అనేక రకాల డ్రైఫిష్ క్రయవిక్రయాలు భారీగా సాగుతుంటాయి. సంత గత వైభవం కోల్పోయినప్పటికీ వారం వారం లక్షల్లో అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇక్కడకు నాగాయలంక మండలంలోని పరిసర 20 గ్రామాల ప్రజలతోపాటు చెన్నై, హైదరాబాద్, వరంగల్ తదితర పట్టణాల నుంచి వ్యాపారులు వచ్చి సరుకు కొనుగోలు చేస్తుంటారు. ఈ మేరకు గతం నుంచీ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి చేపల హోల్సేల్ క్రయవిక్రయాలు ప్రారంభమయ్యేవి. సాయంత్రం 6గంటల వరకు జరిగేవి. ప్రస్తుతం శనివారం మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రారంభమై రాత్రికే ముగిసిపోతుంది. గతంలో అందరికీ అందుబాటులో ఉండే ధరలు చుక్కలు చూపిస్తున్నయని కొనుగోలుదారులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాల హోల్సేల్ వ్యాపారులు ఎగబడటంతో ఏ తీరప్రాంతంలో లేని ధరలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. మరో పక్క ధరలు గిట్టుబాటే కావడంలేదని మత్స్యకారులు చెపుతున్నారు.