వసతి గృహాన్ని తనిఖీ చేసిన సోషల్ వెల్ఫేర్ డీడీ
అవనిగడ్డ : స్థానిక ఎస్పీ బాలుర వసతీ గృహాన్ని సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డెరైక్టర్ బి.మధుసూదనరావు సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబు ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం కలెక్టర్ 52 మందిని పరిశీలికులుగా నియమించినట్లు చెప్పారు.
వసతీ గృహాల్లో మౌలిక సదుపాయూలు, మెనూ అమలు తీరు పరిశీలించి, నివేదికను అందించేందుకు ఈ తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వీఎస్ఎస్ గణేష్బాబు పాల్గొన్నారు.
స్టాకు వివరాలు సక్రమంగా ఉండాలి
నందిగామ రూరల్ : విద్యార్థుల వసతి గృహాల్లో స్టాక్రిజిస్టర్లు సక్రమంగా లేకపోతే ఉపేక్షించేంది లేదని సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ఎం.చిట్టిబాబు హెచ్చరించారు. నందిగామ పట్టణంలోని ఎస్సీ-1 బాలుర వసతి గృహాన్ని సోమవారం రాత్రి పొద్దుపోయాక ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహకుడు రవికుమార్ను అడిగి స్టాక్, విద్యార్థుల వివరాలను తెలుసుకున్నారు. రిజిస్టర్లో స్టాక్ వివరాలకు, నిల్వకు వ్యత్యాసం ఉండటంతో వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. తనఖీల్లో ఎంసీహెచ్ నాగేశ్వరరావు, ఆర్ఐ వెంకటేశ్వరరావు, వీఆర్వో బ్రహ్మం పాల్గొన్నారు.