breaking news
revenue sharing
-
‘జీఎస్టీలో రాష్ట్రాల వాటా చెల్లింపుపై మెలిక’
సాక్షి, న్యూఢిల్లీ : 2017లో జీఎస్టీ వ్యవస్ధ అమల్లోకి వచ్చిన అనంతరం రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ వాటాపై తొలిసారిగా కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన వాటాపై చావుకబురు చల్లగా వినిపించింది. జీఎస్టీ చట్టానికి అనుగుణంగా జీఎస్టీ రాబడుల్లో రాష్ట్రాల వాటాను చెల్లించేందుకు ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని అంగీకరించింది. 2019 ఆగస్ట్ నుంచి అంటే లాక్డౌన్కు ముందే జీఎస్టీ వసూళ్లలో సగమే సమకూరుతున్న పరిస్ధితి. కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం, లేదా పన్ను పరిధిలోకి మినహాయించిన వస్తుసేవలను తీసుకురావడంతో దీన్ని భర్తీ చేయాలని భావించారు. ఇక జీఎస్టీ చట్టంలో పేర్కొన్న తరహాలో రెవెన్యూ షేర్ కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం చెల్లించే పరిస్ధితిలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే స్పష్టం చేశారు. పాండే ప్రకటనపై పార్లమెంటరీ కమిటీలోని విపక్ష సభ్యులు విరుచుకుపడుతున్నారు. బీజేపీ సభ్యుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ ఎదుట పాండే ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. చదవండి : శానిటైజర్లపై 18శాతం జీఎస్టీ ఎందుకంటే..? కమిటీ తొలి భేటీకి హాజరైన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల సభ్యులు ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటనపై మండిపడుతున్నారు. కొద్దినెలలుగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధులను విడుదల చేయడం లేదని ఈ సమావేశంలో విపక్ష సభ్యులు ప్రస్తావించారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ పరిస్ధితుల్లో జీఎస్టీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ కార్యదర్శి పాండే చేసిన ప్రకటనపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
4జీ సేవల ప్రారంభానికి బీఎస్ఎన్ఎల్ కసరత్తు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తాజాగా 4జీ సేవల ప్రారంభంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా రెవెన్యూ షేరింగ్ విధానంలో 14 టెలికం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించడానికి టెక్నాలజీ పార్ట్నర్స్తో జతకట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే రెవెన్యూ షేరింగ్ విధానంలోనే చండీగఢ్లో 4జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘4జీ సేవల ప్రారంభానికి సంస్థ మేనేజ్మెంట్ కమిటీ ఆ మోదం తెలిపింది. రెవెన్యూ షేరింగ్ విధానంలో సేవలను ప్రారంభించాలని భావిస్తున్నాం’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీవాత్సవ తెలిపారు. టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్కు తాము కేవలం బ్యాండ్విడ్త్ను మాత్రమే అందిస్తామని చెప్పారు.