breaking news
Revenue issues
-
పేరుకుపోతున్న అర్జీలు.. పేరుకే సదస్సులు రెవె‘న్యూసెన్స్’!
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బత్తులవారిపాలెంలో నివసించే చిమటా మార్క్కు సర్వే నెంబర్ 351/9 లో 1.26 ఎకరాలు, 314/6 లో 22 సెంట్లు కలిపి మొత్తం 1.48 ఎకరాల పొలం ఉంది. డాక్యుమెంట్లు అన్నీ ఆయన పేరుతోనే ఉన్నా తటవర్తి సాయి, పందరబోయిన శ్రీను అనే వ్యక్తులు ఆ సర్వే నంబర్లలో 1.22 ఎకరాలను ఆక్రమించుకున్నారు. మార్క్ను భూమిలోకి రానివ్వడం లేదు. తన భూమిని ఆక్రమించారని.. సమస్య పరిష్కరించాలని డాక్యుమెంట్లు చేత పట్టుకుని మార్క్ ఏడాదిన్నరగా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించామంటూ రసీదు చేతిలో పెట్టడం మినహా సమస్య పరిష్కరించే నాథుడే లేడని మార్క్ వాపోతున్నాడు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: తప్పుడు పేర్లతో ఆన్లైన్లో రికార్డులు మాయం చేయడం.. పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం.. భూ కొలతల్లో తిమ్మిని బమ్మిని చేయడం.. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. తమ గోడు పట్టించుకునే దిక్కులేక లక్షలాది మంది సతమతమవుతున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తోంది. చలానాలు కట్టినా.. స్వయంగా న్యాయస్థానాలు ఆదేశించినా.. భూములు సర్వే చేసే దిక్కులేక అల్లాడుతున్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతుల్లో సింహభాగం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. ఈ నెల 15న చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు 293 అర్జీలు వస్తే రెవెన్యూ సమస్యలే 204 ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుతున్న ఫిర్యాదుల్లో 70–80 శాతం రెవెన్యూ సమస్యలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉదాశీనత, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బృందాలు ఈ నెల 15న సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ను ఆసాంతం పరిశీలించాయి. మొత్తంగా ఆయా జిల్లాల్లో ఒక్క రోజులో ఎన్ని సమస్యలు వచ్చాయి..? వాటిలో రెవెన్యూ సమస్యలు ఎన్ని..? అని ఆరా తీశాయి. ఆ తర్వాత మంగళ, బుధవారాల్లో పీజీఆర్ఎస్కు హాజరైన కొందరు బాధితుల గ్రామాలకు వెళ్లి సమస్య మూలాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడాయి. వెళ్లిన ప్రతి చోటా సమస్యల పరిష్కారంలో లెక్కలేనితనం, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, అవినీతి స్పష్టంగా కనిపించాయి. ఒక్క రోజులో పరిష్కరించగలిగే చిన్న సమస్యలను సైతం నెలల తరబడి పట్టించుకోకపోవడం లేదని తేటతెల్లమైంది. చలానాలు కూడా కట్టించుకుని సర్వేలు చేయడం లేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందో కళ్లకు కడుతోంది. గత ప్రభుత్వం పరిష్కరించినా.. మళ్లీ అసైన్ ఉచ్చు ఏళ్ల తరబడి పొలాలు సాగు చేసుకుంటున్నా 22–ఏ నిషేధిత జాబితాలో అసైన్డ్ భూములు ఉండటంతో బ్యాంకు రుణాలు అందక, అవసరాలకు భూములు విక్రయించుకోలేక సుదీర్ఘకాలంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్యలను గుర్తిస్తూ, 20 ఏళ్లుగా లబ్ధిదారుల అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను 22–ఏ జాబితా నుంచి తొలగించి వైఎస్సార్సీపీ హయాంలో రైతులకు హక్కులు కల్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పేద రైతులు ఎంతో సంతోషపడ్డారు. కానీ 2024లో చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఫ్రీహోల్డ్ అయిన భూములను తిరిగి 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రుణాల నుంచి క్రయవిక్రయాల వరకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టాదారు పుస్తకాలు ఎక్కడ? గత ప్రభుత్వంలో రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉందనే సాకుతో వాటిని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ప్రభుత్వ ఎంబ్లమ్తో పాసు పుస్తకాలను ఇస్తామని ప్రకటించింది. ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పాసు పుస్తకాల జాడలేదు. పాత పాస్ పుస్తకాలు రద్దు కావడం, కొత్తవి ఇవ్వకపోవడంతో రైతులు రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాసు పుస్తకాలు ఇవ్వాలని పీజీఆర్ఎస్కు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. మొక్కుబడిగా గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు భూముల సంబంధిత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం జనవరిలో 10 రోజులు గ్రామ సభలు నిర్వహించింది. అనంతరం మరో 15 రోజులు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహించింది. కర్నూలు సహా పలు జిల్లాల్లో ఈ సభల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదు. రికార్డుల్లో మాత్రం సమస్యలు పరిష్కారమైనట్లు నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీంతో రెవెన్యూ సదస్సులకు వచ్చిన వారు తిరిగి పీజీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత అధ్వానంగా జరిగాయో స్పష్టమవుతోంది. మ్యుటేషన్లు బంద్.. రీ సర్వేలో మిగులు భూముల మ్యుటేషన్లను చంద్రబాబు ప్రభుత్వం కఠినతరం చేసింది. ఆ భూముల్లో అనుభవదారులున్నా, వాటిని వారి వారసులకు మ్యుటేషన్ చేయడం లేదు. దాదాపు ఏడాదిన్నరగా రైతులు వాటి కోసం పడిగాపులు కాస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చుక్కల భూములపై హక్కులు ఇచ్చారు. అయితే ఆధారాలు చూపలేని కొందరు రైతులకు సంబంధించిన భూములు పెండింగ్లో ఉన్నాయి. ఆ రైతులంతా తమ భూములను డాటెడ్ జాబితా నుంచి తొలగించాలని ఆధారాలతో రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకుంటున్నా ఆలకించడం లేదు. రీసర్వేలో జాయింట్ ఎల్పీఎంలను తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీని కోసం గ్రామాల్లో రైతుల నుంచి లంచాలు వసూలు చేస్తూ టీడీపీ నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారు. వీటిపై కూడా పీజీఆర్ఎస్కు అర్జీలు భారీగా వస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లిలో ఇంజా లక్ష్మీరెడ్డికి వారసత్వంగా వచ్చిన 65 ఎకరాల ఉమ్మడి పొలం ఉంది. నలుగురు అన్నదమ్ములు కావడంతో లక్ష్మీరెడ్డి వాటాగా నాలుగో వంతు రావాలి. సజ్జలదిన్నె గ్రామంలో సర్వే నెంబర్లు 44, 602, 581, 612, 467–డి, 270–ఎం, 270–ఓ, 33, 390–బిలో తొమ్మిది ఎకరాల పొలం వివాదంలో ఉంది. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి పోలీసు భద్రతతో సర్వే చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. సర్వే కోసం బాధితుడు చలానా కట్టినా వీఆర్వో సర్వే చేయించడం లేదు. ‘మేం చేయించం.. నీకు దిక్కున్న చోట చెప్పుకో..’ అని బెదిరిస్తున్నాడు. లక్ష్మీరెడ్డి ఇప్పటివరకు 31 సార్లు అర్జీలు ఇచ్చినా భూమిని సర్వే చేయడం లేదు. రెవెన్యూ వ్యవహారాలు ఇంత అధ్వాన్నంగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలని ఆయన వాపోతున్నారు. విచారిస్తూనే ఉన్నారు...! ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరంలో ముప్పరాజు పాపయ్య పేరుతో 11.93 ఎకరాల భూమి ఉండగా ఆయన ఇద్దరు కుమారులు, పెద్దకోడలు కూడా చనిపోయారు. చిన్న కోడలు శేషమ్మ మాత్రమే మిగిలి ఉంది. ఈ భూమిని ఒంగోలుకు చెందిన రియల్టర్ మారం వెంకటేశ్వరరెడ్డి తప్పుడు పత్రాలతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. శేషమ్మ భూమిని కొట్టేయాలని యత్నిస్తున్నాడు. దీంతో శేషమ్మ రెవెన్యూ అధికారులను సంప్రదించగా ఈ వివాదాన్ని ఎంతకీ తేల్చడం లేదు. ఈ భూమిపై హక్కుదారులెవరో విచారణ చేస్తున్నామని తహసీల్దార్ చెబుతున్నారు.ఎన్ని సమస్యలో..!⇒ మదనపల్లెవాసి మురళీకి కురబలకోట సర్వే నెంబర్ 1913/2ఎలో 3.39, 1913/3లో 1.50 ఎకరాలు భూమి ఉంది. 1958లో మురళి తాత దువ్వూరి రామన్న పేరుతో ఉన్న భూమి ఆయన మృతి తర్వాత 1994లో వారసత్వంగా మురళి పేరుతో రికార్డుల్లోకి ఎక్కింది. దీనికి పక్కనే ఉన్న మరో యజమాని మురళి భూమిని ఆక్రమించాడు. సర్వే చేసి తన భూమికి హద్దులు తేల్చాలని రెండేళ్లుగా మురళి సబ్ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ⇒ చిత్తూరు రూరల్ దిగువమాసాపల్లికి చెందిన తులసికి సర్వే నెంబర్ 183లో ఇంటి స్థలం ఇచ్చారు. ఆమె స్థలాన్ని రెవెన్యూ అధికారులు మరొకరికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. తన స్థలం మరొకరికి ఎలా ఇస్తారని బాధితురాలు ప్రతి వారం తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేకపోవడంతో పీజీఆర్ఎస్ను ఆశ్రయించింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు.⇒ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కుందేరు వాసి షేక్ ఆదాం షరీఫ్ ఇంటి స్థలం, ఇల్లు తొలగించి 2015లో రైవస్ కాలువపై వంతెన నిర్మించారు. ఆయనకు నష్ట పరిహారం చెల్లిస్తామని స్థలం తీసుకున్నారు. పీజీఆర్ఎస్తో పాటు మంగళగిరిలో ప్రజా దర్బార్కు వెళ్లినా షరీఫ్కు పరిహారం దక్కలేదు. ⇒ కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం వాసి విజయభాస్కరరావుకు 3 ఎకరాల పొలం ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చుక్కల భూముల జాబితాలోకి చేర్చడంతో బ్యాంకు రుణాలు తీసుకోలేక ఇబ్బందులు పడ్డాడు. అనంతరం జగన్ ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ వాటికి చుక్క పెట్టింది. కళ్లెదుట మూడు ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఎందుకూ ఉపయోగ పడటం లేదని, నిషేధ జాబితా నుంచి తొలగించాలని బాధితుడు మొర పెట్టుకుంటున్నాడు.⇒ శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం వాసి ప్రభాకర్కు సర్వే నంబర్ 201–7లో వారసత్వంగా సంక్రమించిన 27 సెంట్ల స్థలం ఉంది. ఉపాధి కోసం ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉండటంతో ప్రభాకర్ సమీప బంధువు ఆ భూమిని తన పేరుతో ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు. అక్కడ సెంటు రూ.6 లక్షలు వరకు ఉంది. రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి రూ.1.62 కోట్ల ఆస్తిని కబ్జా చేశారు. తన భూమిని ఇవ్వాలని ఏడాదిన్నరగా ప్రభాకర్ రికార్డులతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఈ నెల 15న శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి గానూ ఇటీవల తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా హాజరైన ప్రజలు ఐవీఆర్ఎస్ కాల్స్, ఆడిట్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిసాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు కనీసం ప్రజల ఆర్థికేతర సమస్యలకు పరిష్కారం చూపడంలోనూ దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనే ఈ విషయం వెల్లడైంది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ డొల్లతనం బయటపడింది. అల్లూరి జిల్లాలో అత్యధికం.. విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేయగా 43 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కరించినట్లు చెబుతున్న వినతులపై ఆడిట్ నిర్వహించడంతోపాటు అర్జీదారులకు ఐవీఆర్ఎస్ కాల్ చేసి అభిప్రాయం కోరగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 62, అన్నమయ్య జిల్లాలో 60, అనంతపురం జిల్లాలో58, ఎన్టీఆర్ జిల్లాలో 53, బాపట్ల జిల్లాలో 50% మంది ప్రజలు విజ్ఞాపనల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ల సదస్సుల్లో సీఎం సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి అసంతృప్తి స్థాయి మూడునెలల్లో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ శాఖలో పరిష్కరించినట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సుల్లోనే ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని కలెక్టర్ల సదస్సులో తేలడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. పట్టా ఇచ్చారు.. భూమి ఎక్కడ? నా భర్త సింహాచలం కల్లుగీత కార్మీకుడు. కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయారు. ప్రభుత్వం సర్వే నెంబర్ 23పీలో నాకు 0.80 ఎకరాల భూమి ఇచ్చింది. పట్టాదారుపాసు పుస్తకం ఇచ్చారు. అడంగల్లో కూడా నా పేరు ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించి హద్దులు తేల్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా. కలెక్టరేట్లో కూడా అర్జీలు ఇస్తున్నా నా సమస్య తీరడం లేదు. – అప్పమ్మ, ఏవో అగ్రహారం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లాఊరికి దూరంగా బతుకుతున్నా నాకు మా గ్రామంలోని సర్వే నెంబర్ 203లో 16 సెంట్ల స్థలం ఉంది. అందులో ఇల్లు కూడా ఉంది. ఈ స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి నన్ను రానివ్వడం లేదు. నాలుగు నెలల క్రితం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి చేసి చంపాలని చూశారు. అప్పటి నుంచి ఊరికి దూరంగా బతుకుతున్నా. గ్రామసభలో చెప్పినా ఫలితం లేదు. నా పేరుతోనే స్థలం డాక్యుమెంట్లు ఉన్నా ఏమిటీ అన్యాయం? అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. – వారి పెద్దిరెడ్డి, ఏట్రవారిపాలెం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లాకలెక్టర్కు చెప్పినా.. మా నాన్న మంగలి నారాయణ పేరుతో సర్వే నంబర్ 893లో 1.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏడాది క్రితం నుంచి ఈ పొలం తమదంటూ 892 సర్వే నంబర్లో ఉంటున్న జగదీష్ గొడవ పడుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్లో మేం సాగు చేసిన పంటను దౌర్జన్యంగా తొలగించాడు. పొలం సర్వే చేసి సమస్య పరిష్కరించాలని ఏడాదిగా తహసీల్దార్, ఆర్డీవోతో పాటు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తున్నా ఫలితం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – మంగలి తిరుపతయ్య, బేతంచెర్ల, నంద్యాల జిల్లా -
Andhra Pradesh: కష్టాలు చెబితే.. కస్సుబుస్సు
గన్నవరంలో గబగబ..కృష్ణా జిల్లా గన్నవరంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగిన తీరును ‘సాక్షి’ బృందం పరిశీలించగా పట్టుమని 20 మంది కూడా పాల్గొన లేదు. భూముల సమస్యలు అత్యధికంగా ఉండే గన్నవరం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సభలో ఇతర పనుల మీద వచ్చిన వారిని కూర్చోబెట్టారు. సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వచ్చిన వారిలో చాలా మంది టీడీపీ సానుభూతిపరులే. గ్రామాలకు సంబంధించి పార్టీ పరమైన సమస్యలను వారు ప్రస్తావించారు. గత సర్కారుపై నిందలు మోపడం, ఈ ప్రభుత్వం ఏదో చేసేసినట్లు చెప్పుకోవడానికి ఆరాట పడ్డారు. తహశీల్దార్, ఇతర అధికారులు ప్రసంగించిన అనంతరం వినతులు స్వీకరించారు. ఇదంతా కేవలం గంటన్నరలోనే ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరగాల్సిన కార్యక్రమాన్ని తూతూమంత్రంగా జరిపారు.సాక్షి, అమరావతి: రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రచారం చేసిన కూటమి సర్కారు వాటిని మొక్కుబడి తంతుగా మార్చి తుస్సుమనిపించింది. లక్షల్లో ఫిర్యాదులు అందుతున్నా వేలల్లో కూడా పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఉసూరుమంటూ కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలకు అవే సమస్యలతో పోటెత్తుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన భూ సంస్కరణలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం వాటిపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ రెవెన్యూ సదస్సులు చేపట్టింది. తూతూమంత్రంగా నిర్వహిస్తుండటంతో స్థానికుల భాగస్వామ్యం పెద్దగా ఉండడం లేదు. పెద్ద గ్రామాల్లో నిర్వహించే సభల్లోనూ 30, 40 మందికి మించి ప్రజలు కనపడడంలేదు. దీంతో కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చేవారిని సభల్లో కూర్చోబెట్టి ఫొటోలు తీసి పంపుతున్నారు. అసలు ఈ సభలను అధికారులే సీరియస్గా తీసుకోవడం లేదు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో ఎలాగోలా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. ఓ మోస్తరుగానైనా జనం వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన చోట వాటికి పరిష్కారం కనిపించడంలేదు. కేవలం తాము పరిష్కారం చూపించగలమన్న అంశాలకు సంబంధించిన వినతులను మాత్రమే అధికారులు స్వీకరిస్తున్నారు. భూ వివాదాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ప్రస్తావిస్తే కోర్టుకు వెళ్లాలని, అది తమ పరిధిలో లేదంటూ తప్పించుకుంటున్నారు. తప్పుడు ఆరోపణలతో.. సీఎంను కలిసినా ఏం లాభం? పలు చోట్ల రెవెన్యూ సదస్సులకు జనం రాకపోవడంతో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వారంతా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలతో అందచేసే వినతి పత్రాలను స్వీకరిస్తూ నమోదు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ నేతల పేర్లు ప్రస్తావిస్తూ ఇచ్చే ఫిర్యాదులు తీసుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సమస్య ఏదైనా సరే వైఎస్సార్సీపీ బాధితులమని చెప్పాల్సిందిగా ఫిర్యాదుదారులకు టీడీపీ నేతలు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలాగే పలువురిని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తరలించి సీఎం చంద్రబాబు, మంత్రులకు విజ్ఞాపనలు ఇప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ బాధితులమని, కబ్జా చేశారని చెబితేనే ప్రయోజనం దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. నిజానికి నేరుగా సీఎం చంద్రబాబుకు అందచేసే విజ్ఞాపనలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన్ను కలిసిన వారు వాపోతున్నారు. లక్షల్లో ఫిర్యాదులు.. ఇప్పటివరకు 12,862 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాయి. సోమవారం వరకు 1,75,182 వినతి పత్రాలు అందగా 12,409 అర్జీలను పరిష్కరించారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత మొక్కుబడిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత నెల 6న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రోజూ 800 నుంచి వెయ్యి గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ చెబుతోంది. జనం లేక వెలవెలబోతున్న సభలో మాట్లాడుతున్న గన్నవరం తహసీల్దార్ సదస్సులతో ఫలితం లేక కలెక్టరేట్లకు..⇒ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు తూతూమంత్రంగా సాగుతున్నాయి. మొదటి రెండు మూడు రోజులు హడావుడి చేసి ఆ తరువాత వదిలేశారు. సదస్సుల్లో ఇప్పటి వరకు 9,155 అర్జీలు నమోదు కాగా కేవలం 142 మాత్రమే పరిశీలించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు అర్జీలతో పోటెత్తుతున్నారు. డిసెంబర్ 23న చిత్తూరు కలెక్టరేట్లో పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి 145 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో స్పందన లేకపోవడంతోనే ప్రజలు కలెక్టరేట్కు తరలివస్తున్నారు. ⇒ తిరుపతి జిల్లాలో గత నెల 28 వరకు రెవెన్యూ సదస్సుల్లో 13,803 అర్జీలు అందగా అందులో 10 వేలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. 22 ఏ భూ సమస్యలు, పట్టాల మార్పులు, మ్యుటేషన్లు, భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల సమస్యలే అధికం. విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో జాప్యం, తాగునీరు, పారిశుద్ద్యం, రేషన్, ఫించన్ సమస్యలపై 3,803 అర్జీలు వచ్చాయి. అయితే విద్యార్థులకు సర్టిఫికెట్స్ సమస్యలను మాత్రమే అక్కడిక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. నోడల్ ఆఫీసర్లు ఎక్కడా దర్శనం ఇవ్వడం లేదు. ⇒ కాకినాడ జిల్లా రెవెన్యూ సదస్సుల్లో అర్జీలను స్వీకరించడం, సమస్యలపై చర్చించడం మినహా ఏ ఒక్కటీ పరిష్కరించిన దాఖలాలు లేవు. కొన్నింటిని వీఆర్వోలకు అప్పగించి ఆ సమస్యలు పరిష్కారమైనట్లు చూపుతున్నారు. ఇప్పటి వరకూ 4,635 సమస్యలపై అర్జీలు వచ్చాయని చెబుతున్నారు. ⇒ విశాఖ జిల్లాలో 4,666 వినతులు రాగా 3,167 అర్జీలను ఇంకా పరిష్కరించాల్సి ఉంది. భూఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు చేస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వినతులు వస్తున్నాయి. రెవెన్యూ పరంగా వచ్చే దరఖాస్తులను జాయింట్ కలెక్టర్కు నివేదిస్తున్నారు. ⇒ అనకాపల్లి జిల్లా రెవెన్యూ సదస్సుల్లో 5,984 వినతులు రాగా 284 అర్జీలను పరిష్కరించారు. భూ ఆక్రమణలు, పట్టాదారు పాసు పుస్తకాలు, కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని వినతులు వస్తున్నాయి. ⇒ అనంతపురం జిల్లా రెవెన్యూ సదస్సుల్లో ఆర్భాటమే కానీ ఫలితం కనిపించడంలేదు. భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు వేల సంఖ్యలో అందుతున్నాయి. 5,450 ఫిర్యాదులు అందగా 366 మాత్రమే పరిష్కరించారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఇప్పటివరకు 9,311 భూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు ఫిర్యాదులు అందాయి. 8,871 సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. ⇒ అన్నమయ్య జిల్లా పరిధిలో సదస్సుల ద్వారా 10,421 సమస్యలపై ప్రజలనుంచి వినతులు అందాయి. 924 సమస్యలకు అధికారులు పరిష్కారం చూపారు. 80 శాతం ఫిర్యాదులు భూ సమస్యలపైనే అందాయి. ⇒ కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 6,908 అర్జీలను స్వీకరించిన అధికారులు కేవలం 513 సమస్యలకు మాత్రమే పరిష్కారాలు చూపారు. అర్జీల పరిష్కారంపై కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. 21 రోజులైనా ఎందుకు పరిష్కారం కావడం లేదని ఇటీవల సమీక్షలో నిలదీశారు. దేవనకొండ మండలంలో ఒక్క అర్జీకి కూడా పరిష్కారం చూపకపోవడంపై సంబంధిత తహసీల్దార్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల సమస్యలే అధికం.. రెవెన్యూ సదస్సుల్లో అందుతున్న ఫిర్యాదుల్లో 60 శాతం పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించినవే ఉంటున్నాయి. తప్పులు, ఆన్లైన్ సమస్యలు, హద్దుల తేడాలు లాంటి సమస్యలే అధికం. భూముల రీ సర్వే మొత్తం తప్పుల తడకని కూటమి నేతలు ప్రచారం చేసినప్పటికీ వాటికి సంబంధించిన వినతులు చాలా తక్కువ సంఖ్యలో రావడం గమనార్హం. అసైన్డ్ భూముల సమస్యలు, నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు, డీ పట్టాలు, ఇళ్ల పట్టాలకు చెందిన వినతులు ఉంటున్నాయి. అయితే రశీదులు ఇవ్వడమే కానీ పరిష్కారం మాత్రం చూపకపోవడంతో దరఖాస్తుదారులు ఉసూరుమంటున్నారు. నెల తరువాత చూద్దాం.. గన్నవరానికి చెందిన పొక్కునూరి సోమలింగేశ్వరరావు, ఆయన సోదరుడు తమకు తండ్రి శోభనాచలపతిరావు నుంచి వారసత్వంగా వచ్చిన 3.3 ఎకరాల భూమిని పంచుకుని మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంతవరకు వారి పేర్లు ఆన్లైన్లో కనిపించడంలేదు. దీనిపై గన్నవరం రెవెన్యూ సదస్సులో వినతి పత్రం అందచేయగా నెల తర్వాత పరిష్కరించేందుకు ప్రయతి్నస్తామని అధికారులు చెప్పారు. -
వారిని నమ్మొద్దు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు(కేటీఆర్) శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. నూతన రెవెన్యూ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. (చదవండి: ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం..) సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా అండగా ఉంటామన్నారు. అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా ఉందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా.. పేద, మధ్య తరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఎవరు కూడా దళారులను నమ్మొద్దని, ఒక్కపైసా ఇవ్వవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
రెవెన్యూ’ సమస్యలు పరిష్కరించాలి..
► ఇక్కడి అధికారుల టీం బాగుంది ► జీవో 58, 59లో ఇంకా ముందుండాలి ► ప్రజలకు కష్టం కలిగించొద్దు ► ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ► అధికారులతో ‘రెవెన్యూ’పై సమీక్ష దిలాబాద్ అర్బన్ : సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ప్రజలకు కష్టం కలిగించవద్దని, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు పెండింగ్లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, సహాయ, పునరావాస, రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భూముల సమస్యలు, ఆహార భద్రత కార్డుల పంపిణీ రెవెన్యూ చేపట్టిందన్నారు. ఇక్కడి అధికారుల టీం బాగుందని.. జీవో 58, 59లో ఇతర జిల్లాల కంటే ఇంకా ముందుండాలన్నారు. జిల్లాకు ఏవైనా ఇబ్బందులుంటే చెప్పాలని, సీఎంతో మాట్లాడామని చెప్పారు. ప్రజలకు కష్టం కల్గించకుండా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జీవో 58 ద్వారా 24,872 దరఖాస్తులు.. అనంతరం జేసీ సుందర్ అబ్నార్ మాట్లాడుతూ జీవో 58 ద్వారా జిల్లా వ్యాప్తంగా 24,872 దరఖాస్తులు రాగా, 16,242 దరఖాస్తులు తిరస్కరించామని, 8,380 దరఖాస్తులను పరిశీలించి భూములను క్రమబద్ధీకరించామని తెలిపారు. సాంకేతిక సమస్యతో ఇంకా 245 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు వివరించారు. జీవో 59కి సంబంధించి 2637 దరఖాస్తులు వచ్చాయని, డబ్బు చెల్లింపు కింద వీరందరి నుంచి రూ.17.85 కోట్లు వసూలు చేసినట్లు వివరించారు. ఇందులో 1,741 దరఖాస్తులను అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మ్యూటేషన్లో 10 కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు. 3,831 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చామని, 345 మందికి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించామన్నారు. ఈ యేడాది కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సాదాబైనామాలపై ప్రత్యేక శ్రద్ధ సాదాబైనామాలపై శ్రద్ధ పెడతామని, దరఖాస్తుల గడువు జూన్ 2 నుంచి 15 వరకు ఉందని పేర్కొన్నారు. సాదాబైనామాల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు మీ సేవ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, తహసీల్దార్ కార్యాలయాల్లో మ్యాన్యువల్గా కొనసాగితే సమస్యలు వచ్చేట్లు ఉన్నాయని జేసీ డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో విరాసత్ చేస్తామని చెప్పారు. భూదాన్ ల్యాండ్ పరిశీలనలో ఉందన్నారు. జమాబంధీలో కేసులు పెండింగ్లో ఉన్నాయని, ల్యాండ్ అక్విషన్లో ముందున్నామన్నారు. సర్వేయర్లు తక్కువగా ఉన్నాయని, 52 మండలాలకు 28 మంది సర్వేయర్లు, 11 డిప్యూటీ సర్వేయర్లు ఉన్నారని తెలిపారు. అనంతరం షాదీముబారక్, ఇతర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీవో 58 ప్రకారం భూముల క్రమబద్ధీకరణలో మూడో స్థానంలో ఉన్నామని, 59లో రెండో స్థానంలో ఉన్నామని మంత్రి జోగు రామన్న తెలిపారు. సమావేశంలో దేవదాయ, హౌసింగ్ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే బాపురావు, సబ్ కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్, డీఆర్వో సంజీవరెడ్డి, డీఆర్డీఏ పీడీ అరుణ కుమారి, డీసీసీబీ చైర్మన్ దామోదర్రెడ్డి, ఆర్డీవోలు ఐలయ్య, శివలింగయ్య, సుధాకర్రెడ్డి, అయేషా మస్రత్ ఖానమ్, తహసీల్దార్లు, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు. -
పోస్టులన్నీ ఖాళీ... ఏం చేయాలి?
ఐదు నెలలుగా జేసీ పోస్టు ఖాళీ ఇన్చార్జి జేసీగా ఏజేసీ సంజీవయ్య నాలుగు శాఖలకు జిల్లా అధికారులు లేరు అనేక విభాగాల్లో ఖాళీ కుర్చీలు {పజలకు సక్రమంగా అందని సేవలు సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా ... ప్రభుత్వ అధికారులు... ఉద్యోగుల పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.దీంతో అనేక శాఖలు ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నాయి. పాలన గాడి తప్పింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. జిల్లా అధికారులు లేక.. జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టు ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్చార్జిగా ఏజేసీ సంజీవయ్య అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో రెవెన్యూ సమస్యలు అధికం. భూ వివాదాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో జేసీ పోస్టు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏజేసీ సంజీవయ్యకు కీలకమైన సంక్షేమ శాఖలతో పాటు అదనంగా జేసీగా ఇన్చార్జి బాధ్యతలు ఉన్నాయి. కలెక్టర్ సెలవుపై వెళ్లినపుడు ఇన్చార్జి బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అప్పగించినా... పనులు మాత్రం ఏజేసీయే చూసుకోవాల్సి వస్తోంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి (డీబీసీడబ్ల్యూఓ), జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అధికారి, డీసీఓ వంటి కీలకమైన బాధ్యతలూ ఇన్చార్జిలే చూస్తున్నారు. ఉద్యోగుల ఖాళీలు ఇలా... జిల్లా విద్యాశాఖలో 24 మంది డీప్యూటీ ఐఓఎస్లకు గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. 12 మంది డీప్యూటీ ఈఓలు ఉండాల్సి ఉండగా... ముగ్గురే ఉన్నారు. జిల్లాలో 790 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్వీఎంలో 24 ఇంజినీర్ పోస్టులు అవసరం కాగా...12 మంది మాత్రమే ఉన్నారు. ఐదు ఏబీసీడబ్ల్యూఓ, 13 హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. -
పోస్టులన్నీ ఖాళీ...ఏం చేయాలి?
ఐదు నెలలుగా జేసీ పోస్టు ఖాళీ ఇన్ఛార్జీ జేసీగా ఏజేసీ సంజీవయ్య నాలుగు శాఖలకు జిల్లా అధికారులు లేరు అనేక విభాగాల్లో ఖాళీ కుర్చీలు {పజలకు సక్రమంగా అందని సేవలు సిటీ బ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్నా ... ప్రభుత్వ అధికారులు... ఉద్యోగుల పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.దీంతో అనేక శాఖలు ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నాయి. పాలన గాడి తప్పింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. జిల్లా అధికారులు లేక.. జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టు ఐదు నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్చార్జిగా ఏజేసీ సంజీవయ్య అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో రెవెన్యూ సమస్యలు అధికం. భూ వివాదాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో జేసీ పోస్టు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఏజేసీ సంజీవయ్యకు కీలకమైన సంక్షేమ శాఖలతో పాటు అదనంగా జేసీగా ఇన్చార్జి బాధ్యతలు ఉన్నాయి. కలెక్టర్ సెలవుపై వెళ్లినపుడు ఇన్చార్జి బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అప్పగించినా... పనులు మాత్రం ఏజేసీయే చూసుకోవాల్సి వస్తోంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి (డీబీసీడబ్ల్యూఓ), జిల్లా యువజన సంక్షేమ అధికారి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్ అధికారి, డీసీఓ వంటి కీలకమైన బాధ్యతలూ ఇన్చార్జిలే చూస్తున్నారు. ఉద్యోగుల ఖాళీలు ఇలా... జిల్లా విద్యాశాఖలో 24 మంది డీప్యూటీ ఐఓఎస్లకు గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు. 12 మంది డీప్యూటీ ఈఓలు ఉండాల్సి ఉండగా... ముగ్గురే ఉన్నారు. జిల్లాలో 790 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆర్వీఎంలో 24 ఇంజినీర్ పోస్టులు అవసరం కాగా...12 మంది మాత్రమే ఉన్నారు. ఐదు ఏబీసీడబ్ల్యూఓ, 13 హాస్టళ్లలో వార్డెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని శాఖల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.


