breaking news
retired employee services
-
ఐదుగురు అధికారుల్లో టెన్షన్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగం నుంచి రిటైరయ్యాక కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వారి గురించి ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో వారికి వివిధ శాఖల్లో కొనసాగింపు ఉంటుందా? లేదా? అనే సస్పెన్స్ మొదలైంది. వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం రిటైరయ్యాక కూడా పలు హోదాల్లో కొనసాగుతున్న అధికారులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు రేపు(బుధవారం) సాయంత్రం ఐదు గంటలలోపు వారి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఉన్న వారి కొనసాగింపు ఉంటుందా? ఉండదా? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ప్రస్తుతం కొత్త సర్కార్ ఫోకస్లో ఐదుగురు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఐదుగురు అధికారులు వీరే.. ► MCRHRDITలో సలహాదారుగా ఉన్న రిటైర్డ్ IFS తిరుపతయ్య ► ఆర్కియాలజీలో బుద్ధభవన్ ప్రాజెక్ట్ చూస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ శివనాగిరెడ్డి ► ప్రోటోకాల్ అధికారిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అరవింద సింగ్ ► ఎండోమెంట్స్లో ఉన్న రిటైర్డ్ అధికారి అనిల్ కుమార్ ► రెండేళ్ల ఎక్స్ టెన్షన్తో పనిచేస్తున్న ఐఏఎస్ రాణి కుముదిని. -
జిల్లాల వారీగా పరిశ్రమల సర్వే: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలపై జిల్లాల వారీగా సమగ్ర సర్వే నిర్వహిం చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న మధ్యతరహా, భారీ పరిశ్రమల వివరాలన్నీ సేకరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కేటగిరీల వారీగా ప్రస్తుతం ఎన్ని పరిశ్రమలు పనిచేస్తున్నాయి.. వాటికి అవసరమయ్యే విద్యుత్ సామర్థ్యం ఎంత... మూతపడ్డ పరిశ్రమలెన్ని, అందుకు దారితీసిన కారణాలేమిటి... అవసానదశలో ఏవైనా పరిశ్రమలు ఉన్నాయా... తదితర వివరాలన్నీ సమగ్ర సర్వే ద్వారా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. బుధవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి సవ్యసాచిఘోష్, అడిషనల్ డెరైక్టర్ మధుసూదనరెడ్డి, చేనేత జౌళి శాఖ ఇన్చార్జి కమిషనర్ నర్సింహారావులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్త పారిశ్రామిక విధానంలో ప్రవేశపెట్టిన టీ-ఐడి యా, టీ-ప్రైడ్ పథకాలకు జనవరి ఒకటో తేదీ లోగా మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి పరిశ్రమల విభాగానికి ఏమేం నిధులు వచ్చా యో వివరాలు రూపొందించాలని కోరారు. విదేశాల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని విశ్వవ్యాప్తం గా ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సందర్భాన్ని బట్టి ప్రవాస భారతీయులతో సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.