breaking news
ravindranathreddy
-
చంద్రబాబు హయాంలో కరువు, కాటకాలు
-
ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
సాక్షి, అమరావతి/తిరుపతి క్రైం: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోన్న ఎస్ఎం రఫీ రూ.9 వేలు లంచం తీసుకుంటూ శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. తిరుపతిలోని శ్రీపురం కాలనీలో నివాసముంటున్న రవీంద్రనాథ్ రెడ్డి వద్ద టి.నరసింహ అనే వ్యక్తి ఫ్లాట్లు కొనుగోలు చేశాడు. ఇంటి పన్నులు నరసింహ పేరుతో రాకపోవడంతో గత నెల 23న 6 వార్డు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రఫీని నరసింహ కలిశాడు. ఇంటి పన్ను కాగితాలపై పేరు మార్చేందుకు గాను రూ.10 వేలు లంచం ఇవ్వాలని రఫీ డిమాండ్ చేశాడు. చివరకు రూ.9 వేలకు బేరం కుదిరింది. అనంతరం నరసింహ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం తిరుపతిలోని ఓ బట్టల దుకాణం వద్దకు డబ్బులు తీసుకొని రమ్మని నరసింహకు రఫీ చెప్పాడు. అక్కడ నరసింహ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రఫీని అరెస్ట్ చేశారు. నిందితుడిని నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. -
'మేం రెడీ.. మీరు రాజీనామాకు సిద్దమా?'
కడప: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధమని ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. కడప పట్టణంలో రవీంద్రనాధ్రెడ్డి స్థానిక మీడియాతో శనివారం నాడు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని నల్లపాడులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు.